ఏపీ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా.
J.SURENDER KUMAR,
గంగమ్మ తల్లికి సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్. కె. రోజా పేర్కొన్నారు.
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఆదివారం ఉదయం పర్యాటక శాఖ మంత్రి కుటుంబ సభ్యుల తో కలసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయం లో మంత్రి మాట్లాడుతూ బిడ్డలందరినీ చల్లగా చూసుకుంటు అందరిని కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు తల్లులు కోరుకునే విధంగా ఇవ్వడమే గంగమ్మ తల్లి కే చెల్లునని,
గంగమ్మ తల్లి మన తిరుపతి ఆడబిడ్డని నేను చదువుకునే రోజుల్లో చూసిన గంగజాతరకు ఇప్పుడు జరుగుతున్న గంగ జాతర కు చాలా అభివృద్ధి చెందిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ గంగమ్మ ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసన సభ్యులు మా గురువుగారు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కి నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగ గా ప్రకటించిన ముఖ్యమంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రజలకే కాకుండా భారత దేశ ప్రజలందరికీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ మహిమ,గొప్పదనం, చరిత్రను, విశిష్టతను తెలియజేసే విధంగా గంగ జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈరోజు వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకోవడం, పొంగ లుపెట్టడం, మహా కుంబాభిషేకం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గత సంవత్సరంలో మంత్రిగా గంగమ్మ ఆలయానికి రావడంజరిగిందని, ఈ సంవత్సరం గంగమ్మ జాతర రాష్ట్ర పండుగ గా నిర్వహిస్తున్న సందర్భంగా రావడం గంగమ్మ తల్లి ఆశీర్వాదమేనని తెలిపారు. గంగమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అందజేయాలని, రాష్ట్ర పరిపాలనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పరిపాలించే విధంగా ముఖ్యమంత్రి కి అమ్మవారు దీవెనలు నిండుగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారికి తన కుటుంబ సభ్యులతో కలిసి సారె అందజేసే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
అంతకు ముందు పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి రాష్టంలోనే వివిధ జిల్లాల కు చెందిన వివిధ రకాల కళాకారులు
దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోయారు. గంగమ్మ నామ స్మరణతో, నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు, తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల
కళాప్రదర్శలు నడుమ మంత్రి కుటుంబ సభ్యులతో ఊరేగింపుగా సారె తీసుకొని ఆలయం చేరుకోగా ఆలయం వద్ద ఎమ్మెల్యే, ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యక పూజనిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.
భక్తి చైతన్య యాత్ర లో ప్రజలు భాగస్వామ్యం!

5 వరోజు గంగమ్మ భక్తి చైతన్య యాత్ర ఊహలకు అందని స్థాయిలో తిరుపతి పట్టణ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో భాగస్వామి అయ్యారని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు
ఆదివారం సాయంత్రం
తొలి గడప అనంత వీధి నుండి ప్రారంభమైన గంగమ్మ భక్తి చైతన్య యాత్ర లో స్థానిక ఎమ్మెల్యే పిలుపుతో పరసాల వీధి , రామ చందర పుష్కరిణి మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు,
బండ్ల వీధి ద్వారా శ్రీ తాతయ్య గుంట
గంగమ్మ ఆలయం కు చేరుకుంది.
భక్తి చైతన్య లో రాష్టంలోనే వివిధ జిల్లాల కు చెందిన వివిధ రకాల కళాకారులు
దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోయారు. గంగమ్మ నామ స్మరణతో పట్టణం మారుమోగింది. నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు,తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల,గిరిజన నృత్యం వంటి కళాప్రదర్శలు నడుమ ఊరేగింపుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ ఆలయం చేరుకుంది.
అనంతరం ఆలయమువద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 5వ రోజు నిర్వహించిన గంగమ్మ భక్తి చైతన్య యాత్ర ఊహలకు అందనిస్థాయిలో పట్టణ ప్రజలకు భాగస్వాములు అయ్యారని తెలిపారు.

రంగుల పోటీల్లాగా వేషాలు వేసుకొని అతి ఉత్సాహంగా భక్తులు పాల్గొన్నారు. గంగమ్మ జాతరంటే ఇలాగా ఉంటుందని అనిపించేలా భక్తి చైతన్య యాత్ర సాగిందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి చెల్లి గంగమ్మకు జరుపుకునే పండగ ఇదేని అనిపించేలా పట్టణంలోని ప్రతి గడప గడప నుండి కదిలివచ్చి చైతన్య యాత్రలో భాగస్వామ్యం అవడం జరిగిందన్నారు. జాతర బ్రహ్మత్స వాలు మొదలైనప్పటినుండి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్నదిని తిరుపతి చుట్టుపక్క ప్రాంతాల ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా అనేకమంది భక్తులు వచ్చి వేశాలు వేసి గంగమ్మను దర్శించుకోవడం జరుగుతుందన్నారు బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటినుండి ప్రతిరోజు 80 వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సుమారు లక్ష మంది భక్తులు గంగమ్మ దర్శించుకున్నారని తెలిపారు. గంగమ్మ తల్లికి ఇష్టమైన వేషాలు వేసుకొని గంగమ్మను తృప్తి పరచడం తో పాటు ఈరోజు నిర్వహించిన భక్తి చైతన్య యాత్ర విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ హరిత, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో ముని కృష్ణయ్య, ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు పలు రకాల వేషాలుతో పాల్గొని తమవంతు భక్తిని చాటుకున్నారు.
