J. Surender Kumar,
గ్రీవెన్స్ డే ద్వారా వచ్చే ప్రతి పిర్యాదు పై స్పందించి బాధితులకు న్యాయం అందించే విధంగా పని చేయడమే తమ లక్ష్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ అన్నారు.
సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన 18 అర్జీదారుల నుండి ఫిర్యాదులు, ఆర్జీలు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. భూ తగాదాలు, ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
