పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రం ఏపీ-దేవులపల్లి అమర్

“పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రం ఏపీ
ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు,అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని, అమలు చేస్తోందని, ఏపీ ప్రభుత్వ రాష్ట్ర ,జాతీయ ,మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు.


శనివారం కేరళ రాష్ట్రం కొచ్చిలోని, లే మెరిడియన్‌ లో జరిగిన “మలనాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ – ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవులపల్లి అమర్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ విండో పద్ధతిలో, ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని, పారదర్శకంగా అమలు చేస్తున్నందున ,పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అని, అదేవిధంగా రైతులు, ఉత్పత్తిదారులకు, లాభం కలిగే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది అని అమర్ వివరించారు.
మలనాడు టీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీ ఆర్.జయేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ , ద్వారా అందిస్తున్న సేవలు అద్భుతమని అభినందించారు.
జర్నలిజం రంగంలో చేసిన సేవలకు దేవులపల్లి అమర్ కు “టీవీ ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు 2022” పురస్కారాన్ని ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వి. బి. రాజన్,. (అవార్డుల కమిటీ జ్యూరీ కమిటీ) సభ్యుడు, వివిధ జాతీయ దినపత్రిక పాత్రికేయులు, ఎడిటర్లు, తదితరులు పాల్గొన్నారు