జిల్లాలో ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులు ప్రజా సమస్యల నివారణ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ G రవి ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు మరియు ఇతర అంశాలపై అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు మీసేవా, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించి రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ ,శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.
