తిరుమల దర్శనం టిక్కెట్లు ఈనెల 21 నుంచి….

తిరుమల ద‌ర్శ‌న టిక్కెట్లు మార్చి 21న విడుద‌ల

            శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300/-  ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను మార్చి 21వ తేదీ నుండి వరుసగా మూడు రోజుల పాటు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న,
మే నెల కోటాను మార్చి 22న,
జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేస్తారు.
రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు సోమవారం నుండి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు, గురువారం నుండి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
కింది తిరుపతిలో….
అదేవిధంగా, స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లను రోజుకు 30 వేల టోకెన్లు చొప్పున ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన‌ కౌంట‌ర్ల‌లో భ‌క్తుల‌కు కేటాయిస్తారు.