భక్తజనంతో పోటెత్తిన భద్రాచలం !!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఆదివారం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. వేద మంత్రోచ్చాయలతో నిర్వహించారు. భద్రాచల క్షేత్రం . భక్తజనంతో పోటెత్తిన గా, రామ నామ స్మరణతో మారు మ్రోగింది. ఆధ్యాత్మిక సందడి నెలకొన్న భద్రాచల పుణ్యక్షేత్రంకి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షించి భక్త జనం పులకించిపోయింది.

ప్రభుత్వం పక్షాన !
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామి వారికి పట్టు వస్త్రలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. అర్చకులకు అందజేశారు. భద్రాద్రి పుణ్యక్షేత్రంలోని మిధిలా స్టేడియంలో
శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని వేద మంత్రోత్సవాలు, మంగళవాయిద్యాల మధ్య కమనీయంగా నిర్వహించారు.

భక్తుల భక్తిభావంతో, భక్తిశ్రద్ధలతో శ్రీ రామ జయ రామ జయ జయ రామ ధ్వనుల మధ్య’ అభి జిత్ ముహూర్తాన’ శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా కన్నుల పండువగా జరిగింది. శ్రీ రామ భక్తుడైన భక్త రామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లి కొడుకుగా, సీతమ్మ పెండ్లి కుమార్తెగా దర్శనమిచ్చారు. సుముర్తాన జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది.

టిటిడి పక్షాన !
తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన పాలకవర్గం చైర్మన్
వై.వి. సుబ్బారెడ్డి దంపతులు,స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకున్నారు.

కోవిడ్ తర్వాత ..
రెండు సంవత్సరాలు తరువాత జరిగిన కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి ఆసాంతం భక్తుల సందడితో నిండిపోయింది. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమోగింది. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తరువాత శ్రీసీతారాముల కళ్యాణ ఉత్సవాలు నిర్వహించడంతో రాష్ట్ర నలుమూల నుండి భక్తకోటి జనం కుటుంబ సభ్యులతో తరలివచ్చి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి, స్వామి దర్శనభాగ్యం పొంది పునితులైనారు.

ముందస్తు గా భారీ ఏర్పాట్లు !
. పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ అనుదీప్ నేతృత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులకు సమగ్ర సమాచారం అందిస్తే ఉత్సవాలు విజయవంత
మైనట్లేనని అధికార యంత్రాంగం భావించింది. కాబట్టి గతంలో 5 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసే సమాచార కేంద్రాలను 25 ఏర్పాటు చేశారు.భక్తుల కొరకు ప్రత్యేకంగా మల్టీ కలర్ సమాచార కరపత్రాలను తయారు చేపించారు.

175 క్వింటాళ్ల తలంబ్రాలు!
ప్రతి ఒక్కరికి తలంబ్రాలు అందాలని 175 క్వింటాలు తలంబ్రాలు సిద్ధం చేశారు. గతములో 15 కేంద్రాలు మాత్రమే తలంబ్రాలు కొరకు ఏర్పాటు చేసేవారు. ఈ సంవత్సరం దాదాపు 80 తలంబ్రాలు కేంద్రాలు ఏర్పాటు చేపించారు. సెక్టార్లో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రతి సెక్టార్ కు రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు జిల్లా అధికారులను నియమించారు. పట్టణంలో పార్కింగ్ ప్రాంతాల సమాచారం భక్తులు తెలుసుకునే విదంగా అవగాహన కల్పించారు. సమాచార శాఖ ద్వారా 25 సమాచార కేంద్రాలు ఏర్పాటుతో పాటు కళ్యాణ మండపం నుండి పట్టణం మొత్తం రామ నామం వినిపించే విడిగా మైక్ లు ఏర్పాటు చేపించారు.

ప్రముఖులు క్షేత్రానికి ..
కల్యాణ వేడుకలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భద్రాచలం శాసన సభ్యులు పొందేం వీరయ్య, భద్రాచలం, ఖమ్మం జడ్పి చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్ రాజు, ఖమ్మం, ములుగు కలెక్టర్లు విపి గౌతమ్, కృష్ణ ఆదిత్య, ఐటిడిఎ పిఓ గౌతమ్ పోట్రూ హై కోర్ట్, జిల్లా న్యాయ మూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. వేడుకలు అంగరంగ వైభవంగా, అధ్యతం భక్తి భావంతో జరగడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు.

వేడుకలు నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు,
హైకోర్టు జడ్జి వెంకటేశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,
భద్రాచలం శాసనసభ్యులు పొదేం
వీరయ్య, ఖమ్మం కలెక్టర్ వి పీ గౌతం, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటిడిఎ పిఓ గౌతమ్ పోట్రూ, భద్రాద్రి, ఖమ్మం జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్ రాజు, దేవస్థానం ఈవో శివాజీ, ఎస్పీ సునీల్ దత్, భద్రాద్రి ఇన్చార్జి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణం లో హైలెట్స్

- కనులపండువగా రామయ్య కళ్యాణం జరిగింది.
- పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రులు.
- : సీతారాముల కల్యాణానికి
: మరోసారి హాజరుకాని సీఎం కేసీఆర్ - కళ్యాణ వేడుకకు భారీగా హాజరైన భక్తజనం
*: రేపు శ్రీ రామ పట్టాభిషేకం
*: ముగిసిన భద్రాద్రి రాముని కళ్యాణం - భద్రాచలంలో భక్తులకు ఆసరాగా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం
*: ముత్యాల తలంబ్రాలుకోసం భక్తుల తోపులాటలు
మజ్జిగ ప్యాకెట్లు అందజేత