కేసుల నమోదు పురోగతిపై- డి జి పి మహేందర్రెడ్డి సమీక్ష!

క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసులపై
పోలీస్ కమిషనర్లు,జిల్లా ఎస్పీలతో గురువారం డీజీపీ మహేందర్ రెడ్డి కేసులో పురోగతి పై సమీక్ష . నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డి  ఆదేశించారు.
జిల్లా ఎస్పీలతో, కమిషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేర సమీక్షా సమావేశంలో డీజీపీ  మాట్లాడుతూ…. క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ ,గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. కోర్టు కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా ట్రయల్ సమయంలో పోలీసు అధికారులు సంబంధిత కోర్టులకు వెళ్లి గ్రేవ్, నాన్ గ్రేవ్ మరియు మహిళలకి సంబంధించిన కేసులలో సాక్ష్యలను మోటివేట్ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 44 మంది కి వివిధ కేసులలో న్యాయస్థానం జీవిత ఖైదు విధించడం జరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులను, కోర్ట్ డ్యూటీ  ఆఫీసర్లను, అభినందించారు.  ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, ప్రతి  కేసుకు సంబంధించి ప్లాన్ అఫ్ యాక్షన్ రాయాలని, దీనికి సంబంధించి డీఎస్పీ లు ,యూనిట్ ఆఫీసర్ లు, మానిటర్ చేయాలని సూచించారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ వారిగా జిల్లా స్థాయిలో ప్రతిరోజూ మానిటర్ చేయాలని సూచించారు.

ఎస్.హెచ్.ఓ.లు, రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్., సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై  డీజీపీ  సమీక్ష నిర్వహించారు. వర్టికల్స్ వారిగా  సిబ్బంది యొక్క పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారం లో ఒక రోజు మీట్టింగ్ కండక్ట్ చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టీకల్స్ పకడ్బందీగా అమలు చేయడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్న యూనిట్ అధికారులను మరియు వర్టీకల్స్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ అదనపు ఎస్పీ శ్రీ రూపేష్ , SB డీఎస్పీ రవీంద్ర కుమార్, SB, ఐటీ కోర్, DCRB ఇన్స్పెక్టర్లు  శ్రీనివాస్, సరిలాల్ , దుర్గ , DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

శిక్షణ ఐపీఎస్ అధికారులకు, ఆ హత్య కేసు !
            పాఠ్యాంశం అయింది.
   (ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  హాని ట్రాప్ హత్య కేసు)

డబ్బుల కోసం వేసిన వలపు గాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతి మెత్తగా మాట్లాడిస్తూ. అతడ్ని ట్రాప్‌ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్‌ చేసి లక్షలు డిమాండ్‌ చేశారు. సొమ్ము లిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్‌కే ప్రమాదమని చంపేశారు. మృత దేహం వానస రాకుండా ఫ్రిజ్‌లో కుక్కేశారు. పది రోజు లైనా ఆచూకీ లభించలేదు.
కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరి జ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు.. వారికి  జీవిత కాలం శిక్ష పడింది.


వివరాలలోకి వెళితే !


సిరిసిల్లలో 2011 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్‌ లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ  ఐపీఎస్‌ లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యో దంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్‌ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు.


11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటన
క్రైం నంబరు 173/2011


సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌ నగర్‌కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి గర్దాస్‌ శ్రీనివాస్‌ (42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్‌కు ఫోన్లో పరిచయ మైంది. హైదరాబాద్‌ రావా ల్సిందిగా కోరింది. శ్రీనివాస్‌ 2011 జూన్‌ 20న హైదరాబాద్‌ ఉప్పల్‌లోని ఏఆర్‌కే అపార్ట్‌ మెంట్‌కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబ సభ్యులను 25లక్షలు డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తు పడితే సమస్య ఏర్పడు తుందని అదే అపార్ట్‌ మెంట్‌లో హత్యచేశారు.ఫ్రిజ్‌లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటన పై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు.


పక్కావ్యూహంతో. వలపు వల


ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్‌ ఉరఫ్‌ శేఖర్‌ (30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్‌కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్‌ సిరిసిల్లు మకాం మర్చాడు.
సిరిసిల్లలో ప్రముఖ వస్త్ర వ్యాపారి గర్దాస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిర తో సాన్నిహిత్యం పెంచు కున్నాడు. భర్తతో విడాకు లై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు.
తమ ఇంటి యజమాని శ్రీనివాస్‌ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్‌ చేస్తే డబ్బులు గుంజ వచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం. హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో రెండునెలల కోసం ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్‌ సుజాతతో శ్రీనివాస్‌కు ఫోన్‌ చేయించి ట్రాప్‌ చేశారు.


2011 జూన్‌ 20న శ్రీనివాస్‌ను హైదరాబాద్‌ రావాల్సిందిగా సుజాత కోరగా. శ్రీనివాస్‌ వెళ్లి అపార్ట్‌మెంట్‌లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్‌ శ్రీనివాస్‌ను బంధించాడు. శ్రీనివాస్‌ తండ్రి గడ్దాస్‌ నర్సప్పకు ఫోన్‌ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్‌ లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు.
బంధీగా ఉన్న శ్రీనివాస్‌ జూన్‌ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచెందుకు కొత్త ఫ్రీజ్‌ కొన్నారు. శవాన్ని మూటగా అందులో ఉంచారు. జూన్‌ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్‌కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్‌ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్‌లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు.


2017 సెప్టెంబరు 12న శిక్ష


శ్రీనివాస్‌ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్‌ఫోన్‌ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టు కున్నారు. అతడ్ని విచారించి అపార్ట్‌మెంటుకు వెళ్లగా. ఫ్రీజ్‌లో శవం బయట పడింది. నిందితులు భీవండికి పారిపోగా. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్‌ జానకీ (ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎస్పీ) అప్పటి ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్ (ఇప్పుడు డీసీపీ ట్రాఫిక్ రాచకొండ), అధ్వర్యం లో సిరిసిల్ల టౌన్‌ సీఐ సర్వర్‌ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్‌ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


రెండు నెలలకే చార్జ్‌షీట్‌


ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్‌ జానకీ (ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎస్పీ) అప్పటి ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్ (ఇప్పుడు డీసీపీ ట్రాఫిక్ రాచకొండ) సూచన సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్‌షీట్‌ వేశాం. నిందితులకు శిక్ష పడింది.
ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్‌లకు ఇటీవల పాఠంగా బోధిస్తున్నారు.