ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 18004258187 కాల్ చేయండి -కలెక్టర్ !

జగిత్యాల , ఏప్రిల్ 25:- జిల్లాలో ధాన్యం కోనుగొలు  చేసే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల  పరిష్కారానికి  కాల్  సెంటర్ ను  ఏర్పాటు  చేసామని జిల్లా కలెక్టర్ జి. రవి  తెలిపారు. ధాన్యం కోనుగొలు ప్రక్రియ  పై ఫిర్యాదులు  స్వికరించే దిశగా ఏర్పాటు చేసిన  కాల్  సెంటర్ ను  కలెక్టర్ సోమవారం ప్రారంభించారు.  
యాసంగి లో  రైతులు సాగు  చేసిన  నాణ్యమైన వరి పంటను పూర్తి స్థాయిలో కొనుగొలు చేసే దిశగా  ప్రతి  గ్రామంలో ధాన్యం కోనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని,  జిల్లాలో రబీ  పంట కింద 4.8లక్షల ఎకరాల్లో 1020కోట్ల విలువ గల 5.2లక్షల మెట్రిక్ టన్నుల వరి కోనుగోలు అంచనాతో జిల్లా లో  421 ధాన్యం కొనుగొలు కేంద్రాలను  ఏర్పాటు చేయాల్సి ఉండగా    ఇప్పటి వరకు 327 ధాన్యం కొనుగొలు కేంద్రాలు ప్రారంభించామని, మిగిలినవి అవసరమేరకు గ్రామాల్లో త్వరలో ప్రారంభిస్తామని  కలెక్టర్  తెలిపారు. 


ప్రణాళికాబద్దంగా  ధాన్యం కొనుగొలు ప్రక్రియ జరగాలని, దీని కోసం  క్షేత్రస్థాయిలో  రైతులకు  వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని  తెలిపారు. ధాన్యం కొనుగొలు కేంద్రాలో నేరుగా రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కోనుగొలు చేస్తామని,  దళారుల నుంచి చేయమని స్పష్టం చేసారు.
రైతులకు ధాన్యం నాణ్యత ప్రమాణాల  పై  అధికారులు అవగాహన కల్పిస్తున్నారని,     రైతులు సదరు నాణ్యత ప్రమాణాలు పాటిస్తు  తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే  కొనుగొలు చేస్తామని  కలెక్టర్ స్పష్టం చేసారు. 
ధాన్యం కొనుగొలు ప్రక్రియలో  కలిగే ఇబ్బందుల  పరిష్కారానికి  కాల్ సెంటర్ ప్రారంభించామని, రైతులు  తమ సమస్యలను  టోల్ ఫ్రీ నెం.*18004258187* నెంబర్ కు  ఫోన్ చేసి  ఫిర్యాదు చేయవచ్చని  తెలిపారు.  దాన్యం కొనుగోలు ప్రక్రియ,  రవాణా వంటి అంశాల్లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.


రైతులు ఈ కాల్ సెంటర్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి , జిల్లా పౌర సరఫరాల అధికారి, డి.ఎం. సివిల్ సప్ప్లై, డి.సి.ఓ. ఇతర సంబంధించిన అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


దమ్మన్నపేట లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం!


జైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  అధ్యక్షులు సౌళ్ల నరేష్  ఆధ్వర్యంలో ధమ్మన్నపేట్ గ్రామములో సోమవారం  వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారు.  DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 
              క్వింటాల్ ఒక్కంటికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వివరాలను నరేష్ ప్రకటించారు.                                         
           * గ్రేడు ఏ రూ 1960లు.
        ..* సాధారణం  రూ1940/-
ఈ కార్యక్రమంలో  దమ్మన్నపేట సర్పంచ్ పులిసెట్టి మల్లేశం, ఎంపీపీ చిట్టిబాబు,  ధర్మపురి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు  సౌళ్ల బీమాయ్య,  మార్కెట్ కమిటీ అధ్యక్షుడు  అయ్యోరి రాజేష్,  AEO  మౌనిక, సహకార సంఘం,  పాలకవర్గ సభ్యులు  దండవేణి గంగమల్లయ్య,  సముద్రాల  సత్తయ్య, ,ధమ్మన్నపేట్ ఎంపీటీసీ. తోడేటి గంగాధర్, ధమ్మన్నపేట్  రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గొల్లపెళ్లి సత్తయ్య,  వార్డు సభ్యులు నాయకులు రైతులు పాల్గొన్నారు