జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి గురువారం ఆయన రెవెన్యూ సర్వీసులు, వరి కొనుగోలు, పరీక్షల నిర్వహణ ఇతర అంశాల పై జూన్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీ గా ఉన్న రేషన్ షాపులు కారుణ్య నియామకాల ప్రక్రియ పెండింగు లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఉన్న రెండు డివిజన్ల వారీగా ఆర్డీవోలు రేషన్ షాపులు కారుణ్య నియామకాల ప్రక్రియ పై ఎప్పటికప్పుడు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల వారీగా నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యం కొనుగోలు చేసేవిదంగా, లోడింగ్, ఆన్ లోడింగ్, తహసీల్దార్లు పర్యవేక్షించాలని, కలెక్టర్ ఆదేశించారు.మండలాలలో రైస్ మిల్లర్ల, వారీగా పెండింగ్ ఉన్న సీఎంఆర్, రైస్ డెలివరీ నివేదికను అందజేస్తామని తహసీల్దార్లు, రైస్ మిల్లర్ల పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ ,చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు, మాత్రమే పంపిణీ చేయాలని , వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు.ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల , ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం, అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఆదేశించారు.
ఈ ఆఫీస్ వినియోగం !
మండలాల్లో ఈ ఆఫీస్ వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తసీల్దార్ కార్యాలయంలో పెండింగులో ఉన్న పన్నులు వివరాలు కలెక్టరేట్ కు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షలు సమయాల్లో విద్యార్థులకు ,ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి వసతులు కల్పనకు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ !
ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ,ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

ఎస్ పి సింధు శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ , జిల్లా వైద్యాధికారి, పంచాయతీ అధికారి , మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ సంతోష్ కు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సహాయ సహకారంతో ₹ 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా సంతోష్ జీవన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
