మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు,వారి ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అందులో భాగంగానే తమ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, కార్పోరేషన్ నిత్యావసరాలను ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేసేందుకు “సహజ”బ్రాండ్ ను రూపొందించిందన్నారు.

మంత్రి ఈశ్వర్ నియోజకవర్గం ధర్మపురికి చెందిన సుమారు 200మంది మహిళలు మేడ్చెల్ లోని మమతా, జీడిమెట్ల సుభాష్ నగర్ లో ఉన్న శ్రీయోగి, మణికంఠ మినీ ఇండస్ట్రీలను గురువారం సందర్శించారు. అక్కడ తయారవుతున్న సరుకులు,వస్తువులు, ఉత్పత్తుల తయారీ,ప్యాకింగులను పరిశీలించి, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సహజ బ్రాండ్ ద్వారా ఇప్పటికే సబ్బులు,నూనెలు మార్కెట్లోకి విడుదల చేశాం, రానున్న రోజుల్లో 100 నిత్యావసరాలను వినియోగదారులకు అందిద్దామన్నారు.
సూపర్ ఫైన్ బియ్యం కోసం మనం ఇతర ప్రాంతాలపై ఏ మాత్రం ఆధారపడకుండా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పండించే వడ్లను సేకరించి మిల్లింగ్ చేపిద్దామన్నారు.
అదేవిధంగా మిరపకాయలు,ముడి పసుపు, కందులు, పెసళ్లు, చింతపండు కూడా సేకరించి, శుభ్రపర్చి, అవసరమైన వాటిని మిల్లింగ్ చేయించి, సహజ బ్రాండ్ ప్యాకింగులతో మార్కెట్లోకి విడుదల చేస్తే మంచి లాభాలు పొందొచ్చని చెప్పారు. షాపులు, గోదాములు కూడా ఏర్పాటు చేసుకుందామని, నాణ్యమైన సరుకులు, ఉత్పత్తులు, వస్తువులను అందించడం ద్వారా “సహజ”బ్రాండ్ సహజమైన విజయాలు సాధిస్తుందని.. అద్భుతాలు నమోదు చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో వనరులకు ఏ మాత్రం కొరత లేదని, నీళ్లు, విద్యుత్, నిధులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వం సబ్సిడీలిస్తూ గొప్పగా ప్రోత్సహిస్తున్నది పేర్కొన్నారు.
మీరంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగాలని, కుటుంబానికి కొండంత అండగా ఉండాలని మంత్రి ఈశ్వర్ ఉద్బోధించారు.
ఈ దిశగా మనమందరం మంచి ఆలోచనలు, కార్యాచరణతో ముందుకు సాగుదామని కొప్పుల మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.

గ్రామాలను గుర్తించండి !
జగిత్యాల్ మెట్పల్లి కోరుట్ల మున్సిపాలిటీ లలో విలీనమైన గ్రామాలను గుర్తించి మున్సిపల్ పరిధిలో కి చేర్చాలని PRTUTS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి ఆనందరావులు. అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. విలీనమైన గ్రామాలనుండి 8 Kmల దూరంలో ఉన్న గ్రామాలను వెనువెంటనే గుర్తించాలని R&B ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) శ్రీనివాస్ కి వినతి పత్రం అందించారు.

, ఖిల్లా ను సందర్శించిన కమిషనర్ స్వరూప రాణి !
రానున్న రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా, ఖిల్లా లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్ల ను జగిత్యాల్ మున్సిపల్ కమిషనర్ పరిశీలించి సమీక్షించారు.,
కమిషనర్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మీర్ ఖాజీం అలీ, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మన్సూర్, కౌన్సిలర్లు రజీయొద్దిన్, సుల్తాన్ అహ్మద్, పంబాల రాము, తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే సమీక్ష !
నియోజకవర్గ అభివృద్ధి పనులపై గురువారం జై జగనన్న డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏక్సిక్యూటివ్ ఇంజినీర్ రహమాన్, డిఇ మిలింద్, ఏ ఈ లు, పట్టణ శానిటేషన్, పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది., ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమీషనర్ స్వరూప రాణి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.