జగిత్యాల జిల్లా లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాలు!!

జగిత్యాల జిల్లాలో ఆదివారం గ్రామాల్లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంప్ శ్రీ రామాలయం లో జరిగిన కళ్యాణం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ గూగుల్ లోతు రవి,జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ లు సతీ సమేతంగా తలంబ్రాలు ,పట్టు వస్త్రాలు అందజేశారు.


ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై శ్రీ రాములవారి కళ్యాణం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం జరిగింది,. నదీ తీరంలోనీ శ్రీ శ్రీ రామాలయం లో లో వేద మంత్రాల ఘోషలో కళ్యాణం జరిగింది.


ఆలయం నుంచి తలంబ్రాలు ,పట్టు వస్త్రాలు!
ధర్మపురి గోదావరి నది వద్దగల శ్రీ రామాలయం కు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నుంచి. ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరముకూడ అర్చకులకు అందించారు

. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ,వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , పెండ్యాల హరికృష్ణ శర్మ , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్ , రెనవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న , , అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్, చుక్కరవి ,గుంపుల రమేష్ ,గునిశెట్టి రవీందర్ ,స్తంభంకాడి మహేష్ , వీరవేణి కొమురయ్య ,ఇనుగంటి రమ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ ,జూనియర్ అసిస్టెంట్ తిరుపతి ,పాల్గొన్నారు.

ముదునూరు గండి హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. ప్రముఖ గుండె. వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి దర్శించుకుని వేలాది మంది భక్తజనంకు అన్నదానం, తాగునీటి వసతి సౌకర్యం కల్పించారు