కలెక్టర్లతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ !


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..
ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అరోగ్య రంగానికి బ‌డ్జెట్‌లో రూ. 11,440 కోట్లు కేటాయించారు. ప్ర‌జ‌ల‌కు అత్యున్న‌త వైద్య సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌ది. అని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య సేవలు విస్తృతం అయ్యాయి. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. మరింత మెరుగ్గా ఈ సేవలు ప్రజలకు అందించేందుకు మానిటరింగ్ పెంచాలి. 99 శాతం బాగా పని చేసినా ఒక్క నిర్లక్ష్యం చెడ్డ పేరు తెస్తుంది. అలా జరగకుండా చూడాలి అన్నారు.
ముఖ్యమంత్రి గారి ఆలోచనతో దేశంలోనే టి డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతమైన రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నాము. 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. దీనిపై దృష్టి పెట్టాలి.అరోగ్య శ్రీ సేవలు ప్రజలకు అందేలా చూడాలి అని పేర్కొన్నారు
108, 102 అమ్మ ఒడి, అంబులెన్స్ సేవలు,   వాహనాలు రివ్యూ చేయాలి. ఆసుపత్రుల్లో జిల్లా కలెక్టర్లు సర్ ప్రైస్ విజిట్ చేయాలి. అక్కడి పరిస్థితులను తెల్సుకోవాలి.
పి హెచ్ సి ల్లో వైద్యులు లేరు అనే మాట ఉండొద్దు. ముఖ్యమంత్రి గారు ఎక్కడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని చెప్పారు. ప్రతి పి హెచ్ సి లో డాక్టర్ ఉండాలి. వాక్ ఇంటర్వ్యూ లో పెట్టీ అపాయింట్ చేయాలి.
102 వాహనాలను ఎఫెక్టివ్ గా వాడాలి. గర్భిణులకు సేవలు అందించాలి. ఏ ఎన్ ఎం చేకప్స్ చేయించాలి.
ముఖ్యంగా సి సెక్షన్లు తగ్గించడంలో ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సెక్షన్ల పై ఆడిట్ చేయాలి. తల్లి పిల్లకు నష్టం అనుకున్నపుడు మాత్రమే సెక్షన్ చేయాలి. ఈ విషయంలో పెద్ద మొత్తంలో అవగాహన కల్పించాలి అన్నారు. కేసీఆర్ కిట్స్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతానికి పెరిగింది. ఇది మరింత పెరిగేలా కృషి చేయాలి. వంద శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు జరిగేలా చూడాలి.
ఎన్ సి డి స్క్రీనింగ్ పకడ్బందీగా జరిగేలా చూడాలి. డేటా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి. టీబీ ఫ్రీ స్టేట్ అయ్యేందుకు మనం దగ్గర్లో ఉన్నాము. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇటీవల మలేరియా నియంత్రణకు గాను తెలంగాణకు కేంద్రం నుండి అవార్డు వచ్చింది. ఈ విషయంలో కేటగిరీ 2 నుండి 1 కి వచ్చాము. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ.. ఆసుపత్రులకు కాయకల్ప, లక్ష్య, క్వాలిటీ అసురెన్స్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడాలి. అన్నారు
636 పీహెచ్ సి, 232  అర్బన్ పి హెచ్ సి లో సి సి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.  ఇవి పూర్తి అయితే జిల్లా కలెక్టర్లు సైతం పరిశీలించే వెసులుబాటు ఉంటుంది.


రాష్ట్రంలో 18 ఏళ్లు పై బడిన వారికి,15-17 ఏళ్ల కేటగిరీ,12- 14 ఏళ్ల కేటగిరీలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు చేయాలి. కొత్త మెడికల్ కాలేజీల పనులు, ఆసుపత్రి అప్ గ్రేడేషన్ పనులు వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఈసారి మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలని చెప్పారు. ల్యాండ్ అలాట్మెంట్ ప్రతిపాదనలు త్వరగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు
సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి  వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందిస్తున్నారు. నెలలో ఏదో ఒక రోజు కలెక్టర్లు వైద్యారోగ్యం పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలి. ఎక్కడికి వెళ్ళినా సమీపంలోని ఆసుపత్రులను సర్ప్రైజ్ విజిట్ చేయాలి.  సోమవారం బి అర్ కే భవన్ లో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో  కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ వాకటి కరుణ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీ ఎం ఇ  రమేష్ రెడ్డి, డిహెచ్  శ్రీనివాస్ రావు, టివివిపి కమిషనర్  అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి-
మంత్రి ఈశ్వర్!

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి వేల కోట్ల నిధులు కేటాయించాను అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా లోని పాలకుర్తి ధర్మారం మండలాలలో మంత్రి సోమవారం పర్యటించారు.
పాలకుర్తి మండలంలోని ముంజంపల్లి గ్రామంలో రూ.2
కోట్ల సీ.ఆర్.ఆర్ నిధులతో చేపట్టే రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని ఏర్పాటు చేసిన మినీ గ్రంథాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
ధర్మారం కటికెనపల్లి గ్రామంలో రూ.1.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ధర్మారం మండల కేంద్రంలో మౌళిక వసతుల పనులకు గాను 27.96 లక్షల అంచన వ్యయంతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.


మన ఊరు మన బడి వీడియో కాన్ఫరెన్స్!


మన ఊరు మన బడి కార్యక్రమం అమలు తీరు పురోగతి మరియు ప్రభుత్వ ఆసుపత్రుల పారిశుధ్యం, వైద్య సేవల తీరు పై అన్ని జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న గౌరవ విద్యా, ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు. ఈ సమావేశంలో  జిల్లా కలెక్టర్ జి.రవి, అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, డీఈఓ  జగన్మోహన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీధర్, ఇతర అధికారులు, తదితరులు  పాల్గొన్నారు

వేసవి లో పశువుల సంరక్షణ పోస్టర్ ను ఆవిష్కరించిన  కలెక్టర్ జి.రవి


జగిత్యాల:-జిల్లాలో ఈ వేసవి కాలంలో పశువుల సంరక్షణ పట్ల అవగాహనా కల్పించేలా రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జి .రవి జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఐ.ఎం.ఎ హాల్ లో వేసవి లో పశువుల సంరక్షణ పోస్టర్ ను ఆవిష్కరించినారు.
వేసవి లో పశువుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించేలా వాల్ పోస్టర్ ను రూపొందించడం అభినంధనీయమని తెలిపారు. పశుపోషకులు, పాడి రైతులు వేసవి సందర్భంగా పశువుల సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్ లత, జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి భిక్షపతి, సహాయ సంచాలకులు నరేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ప్రజావాణి !


సోమవారం జిల్లా కేంద్రంలో స్థానిక iam హాలు నందు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై 24దరఖాస్తులు జిల్లా కలెక్టర్ రవి స్వీకరించారు