11 లక్షల గన్నీ సంచులు ధగ్ధం ₹ కోటి ఆస్థి నష్టం
( J. Surender Kumar)
రాజన్నసిరిసిల్ల జిల్లా లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోని అందులో ఉన్న సూమారు 11 లక్షల గన్నీ సంచులు కాలిపోయాయి. గోదాం పై కప్పు మొత్తం మంటలతో ధగ్ధమైంది. ₹.కోటికి పైగా ఆస్థి నష్టం వాటిల్లింది.
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ సమీపంలో ఉన్న గోదాంలో విద్యుత్ సప్లయ్ కూడా లేదు. షాట్ సర్క్యూట్తో ఈ అగ్ని ప్రమాదం సంబంధించే అవకాశాలు లేవు. ఎవరైన ఆ ప్రాంతంలో టఫాసులు కాల్చితే.. ఈ ప్రమాదం జరిగిందా.. ఎవరైన దుండగులు నిప్పంటించారా. అనే విషయం అంతుచిక్కడం లేదు

సంఘటనటపై సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. గోదాంకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి.. గన్నీసంచులకు లేకపోవడంతో రూ.80 లక్షల నుంచి కోటి వరకు ఆస్థి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ప్రాథమిక అంచాన వేస్తున్నారు. ప్రాణ నష్టం ఏం వాటిల్లకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దట్టమైన పోగలు కమ్ముకోవడంతో పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీవాసులు భయందోళనకు గురయ్యారు.
నిప్పంటుకొని పశువుల కొట్టం దగ్ధం

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి వెంకట్రావుపేట్ లో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రోడ్డె లచ్చన్నకు చెందిన పశువుల కొట్టం పూర్తిగా దగ్ధం కాగా సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా .
దీపావళి పర్వదిన కావడంతో పిల్లలు యువకులు, టపాసులు కాల్చగా నిప్పు రవ్వలు ఎగిసిపడి పశువుల కొట్టం పై పడటంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు..
