శాంతిభద్రతల తోనే అభివృద్ధి సాధ్యం ;
జిల్లా కలెక్టర్ జి. రవి

(J. Surender Kumar)
విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే ను జగిత్యాల జిల్లా లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ రవి, ఎస్పీ సింధు శర్మ , పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ… మనం .ఈ యొక్క సొసైటీలో శాంతియుతంగా, ప్రశాంతంగా జీవిస్తున్నామంటే, దానికి కారకులైన, బోర్డర్స్ లో పనిచేస్తున్న సైనికులు గాని, సొసైటీలో 24 గంటల పనిచేస్తున్న పోలీసు వారే కారణం అని అన్నారు. పోలీసు అమరుల త్యాగం, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు..

శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు, దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని , ఇది అభినందనీయమని కలెక్టర్ అన్నారు.

.విధి నిర్వహణలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు, సహాయ సహకారాలు అందిస్తూనే వారికి ఎల్లప్పుడూ సపోర్టుగా పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు .
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ, మాట్లాడుతూ… పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనం. ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం,అభివృద్ధి.పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా సమాజం లో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తూ ,

advertisement

సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో ,సేవాతత్పరత తో పని చేస్తుందన్నారు. .విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబరు 21న, పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహిస్తోంది.

అమర వీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీ జాతీయ ఐక్యత దినోత్సవం వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు .రామాంజనేయులు, .ప్రకాష్, రవీంద్ర రెడ్డి, S B ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,. CCS .ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ .సరిలాల్, .ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ రాజు సి.ఐ లు, కిషోర్, కృష్ణకుమార్, కొటేశ్వర్, రమణమూర్తి, శ్రీను, రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు వమనమూర్తి, నవీన్, ఎస్.ఐ లు పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.