(J. Surender Kumar)
జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండల కేంద్రాన్ని కార్యాలయ భవనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కలెక్టర్ రవిలతో కలసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ మండల ప్రజల ఆకాంక్షలు, అమలుపరచిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
ఏనాడైనా ప్రతి జిల్లా కో మెడికల్ కళాశాల వస్తుందని ఎవరు ఊహించలేదన్నారు, తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని, అలాగే అంబేద్కర్ స్ఫూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఉచిత విద్యాబోధన సాగిస్తున్నారు

సీఎం సహాయనిధి పుణ్య కార్యక్రమం, రాష్ట్రంలోనే ధర్మపురి నంబర్ వన్ అని మంత్రి అన్నారు
ధర్మపురిలో 900 విద్యార్థుల సామర్ధ్యం తో డిగ్రీ కళాశాల ఏర్పాటైందని, డయాలసిస్, ఐసీయూ ఏర్పాటు చేసిన సీఎం గారికి ధర్మపురి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ప్రతిష్టాత్మక రోడ్ల వాగు ప్రాజెక్టుకు, వరదల వల్ల నష్టం జరిగితే ₹ 136 కోట్లు ఇచ్చామని, ముఖ్యమంత్రి రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని, .కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు, 24 గంటల కరెంటు రద్దుకు కేంద్రం కుట్ర జరుగుతోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కొర్రీలు పెడుతుందని, అందుకే రైతులు, ప్రజలు కేంద్రం కుట్రలను తిప్పి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, వెలగటూర్ మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతితులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి లో డిగ్రీ కళాశాల ప్రారంభం !

శుక్రవారం ధర్మపురి లో మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల డిగ్రీ కళాశాల (బాలురు) ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సంఘీ సత్యమ్మ,. జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , ధర్మపురి జెడ్పిటిసి సభ్యురాలు బత్తినీ అరుణ,. బుగ్గారం ఎంపీపీ బాదినేని రాజమణి, ఎంపీ వెంకటేష్ నేత, కలెక్టర్ రవి నాయక్ అనంతరం ఏకికృత వెజ్ అండ్, నాన్ వెజ్ మార్కెట్ మిగులు పనులకు శంకస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక చైర్పర్సన్ సంగి సత్యమ్మ, . వైస్ చైర్మన్ ఇందాక రామయ్య, జెడ్పీటీసీ .అరుణ. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ , R D O మాధురి ప్రజా ప్రతినిదులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.