ఏపీ చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ఆర్ యం భాషా!

కమీషనర్ గా, శామ్యూల్ జొనాతన్ బాధ్యతలు స్వీకరణ!

ప్రమాణం చేయించిన సిఎస్ డా.సమీర్ శర్మ !

(J.Surender Kumar )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ముఖ్య సమాచార కమీషనర్ గా ఆర్.మహబూబ్ భాషా, కమీషనర్ గా పి.శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణం చేయించారు.

బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపిఎం&ఎఆర్) కె.ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికారు..ఇరువురు కమీషనర్లచే సిఎస్ ప్రమాణం చేయించారు. కమీషనర్లకు సిఎస్ డా.సమీర్ శర్మ,.స్పెషల్ సిఎస్ ప్రవీణ కుమార్ లు. వారికి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.


ఈకార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషనర్లు రేపాల శ్రీనివాసరావు, బివి రమణ కుమార్, కట్టా జనార్ధనరావు, ఐలాపురం రాజా, చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ప్రమాణం చేసిన ఆర్.యం.భాషా కుటుంబ సభ్యులు మరియు కమీషనర్ గా ప్రమాణం చేసిన శామ్యూల్ జొనాతన్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర సమాచార కమీషన్ కార్యదర్శి డా.వి.సాంబశివరాజు సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శులు రామసుబ్బయ్య, సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.