సముద్రంలో దూకిన ఎమ్మెల్యే అభ్యర్థి !
మద్దతు దారులతో కలిసి ఈదుకుంటూ ఒడ్డుకు..
ఎమ్మెల్యే సురక్షితం!
ఓట్ల కోసం కోట్లాది విన్యాసాలు..
( J.SURENDER KUMAR)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేడెక్కుతున్న తరుణంలో రాజుల అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే, అంబరీష్ దేర్ ప్రస్తుతం అదే సెగ్మెంట్లో పోటీ చేస్తున్న అభ్యర్థి, తన మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తూ. మంగళవారం సముద్రంలో దూకాడు, ఆయనతోపాటు మద్దతు దారులు కూడా దూకారు. ఈదుకుంటూ సురక్షితంగా ఆ గ్రామానికి చేరుకున్నారు తడిచిన బట్టలతో గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
వివరాలు ఇలా ఉన్నాయి!
అమ్రేలి జిల్లా రాజుల అసెంబ్లీ నియోజకవర్గ నుంచి 2017 లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అంబరీష్ దేర్, ప్రస్తుతం అదే సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.. గుజరాత్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య కురుక్షేత్ర సంగ్రహం తలపించేలా పోటీ నెలకొంది. నెలకొంది. మూడు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
మంగళవారం ఎన్నికల ప్రచారం ముగిసింది డిసెంబర్ 1న మొదటి దశ పోలింగ్, ఈ నెల 29 నుంచి బహిరంగ సభలు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు లేకుండా గ్రామాలలో గడప గడప కు ప్రచారం చేస్తున్నాడు.
ఆ ఓట్ల కోసం సముద్రంలో దూకాడా ?

రాజుల నియోజకవర్గంలో విక్టర్ హార్బర్, సమీపంలో సంజ్ బందర్ గ్రామం ఉంది. తీరప్రాంత గ్రామం కావడంతో, విక్టర్ హార్బర్ నుండి . ఈ గ్రామానికి ఫ్లైఓవర్ సౌకర్యం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామ ప్రజలు సముద్రపు నీటి గుండా రాకపోకలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఎమ్మెల్యే అంబరీష్ దేర్, ఫ్లైఓవర్ నిర్మించాలని అధికార బీజేపీని అనేకసార్లు వినతి పత్రాలు ఇస్తూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అధికార బీజేపీ ప్రభుత్వం ఈ గ్రామానికి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ గ్రామ ఓటర్ల సానుభూతి కోసం అంబరీష్ దేర్ అకస్మాత్తుగా తన అనుచరులతో కలిసి సముద్రంలోకి దూకాడు. 300 మీటర్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు
ఈ సంఘటన చూసిన ఆ ప్రాంత ప్రజలు షాక్ కు గురయ్యారు. సముద్రంలోకి దూకి, అంబరీష్ దేర్, అతని మద్దతుదారులు విక్టర్ హార్బర్ నుండి సంజ్ బందర్ వరకు.దాదాపు 300 మీటర్ల దూరం ఈదుకుంటూ గ్రామానికి వెళ్లారు. ఇదేంటని ఆయనను ప్రజలు అడిగారు. “గత ఐదేళ్లుగా బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ డిమాండ్ను అంగీకరించలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను వినడం లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రజల డిమాండ్లను నెరవేర్చామని మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తోంది. బీజేపీని ప్రజలు నమ్మొద్దు. దీన్ని ప్రజల్లోకి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే నేను సముద్రంలోకి దూకానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబరీష్ దేర్ ప్రజలకు వివరించి తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారిని అభ్యర్థించారు
అమ్రేలి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
కాంగ్రెస్ నుంచి అంబరీష్ దేర్ పోటీ చేయగా, బీజేపీ నుంచి హీరా సోలంకీ పోటీ చేస్తున్నారు. 2017 లో వీరిద్దరూ పోటీ పడ్డారు. అంబరీష్ దేర్ 12,719 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన హీరా సోలంకీ పై విజయం సాధించారు. ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. వీరితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున భరత్ బల్దానియా గోదాలోకి దిగారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది.
ఇక్కడ మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ధరి, అమ్రేలి, సావర్కుండ్ల, లాఠి మరియు రాజుల. గత 2017 ఎన్నికల్లో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ధరి నియోజకవర్గంలో గెలిచిన జే కాడియా, 2020లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం మాత్రమే ప్రస్తుతం బీజేపీ ఆధీనంలో ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉండడంతో నియోజకవర్గంలో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఓట్ల చీలికతో బీజేపీ , కాంగ్రెస్ లో ఎవరికి నష్టం ? ఎవరికి లాభం.? డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వరకు ఆగాల్సిందే.
(వన్ ఇండియా తమిళ్ వెబ్ ఛానల్ ఈ వార్త ప్రచురితమైంది)