ప్రారంభించిన ఎమ్మేల్యే సంజయ్ కుమార్ !
(J.Surender Kumar)
జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పాలియేటివ్ క్రిటికల్ కేర్ యూనిట్ ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ

క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స చేయవచ్చు అని అన్నారు..ప్రజలు నిరంతరం ఆరోగ్యం విషయం లో అప్రమత్తం గా ఉండి జాగ్రతలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సొక కుండా చేసే అవకాశం ఉందన్నారు.

ఆలన కార్యక్రమం ద్వారా మంచానికే పరిమిత మైన రోగులకు వాహనం తో ఇంటివద్ద కే వైద్య సేవలు అందించే సదుపాయం ఉందని అన్నారు…జిల్లా కి మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే అన్నారు..మెడికల్ కాలేజీ చుట్టూరా రహదారి నిమిత్తం ₹10కోట్ల నిధులు మంజూరు అయ్యాయని అన్నారు…జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని…రాష్ట్రంలో 110 డయాలసిస్ సెంటర్ లు ఏర్పాటు చేసుకున్నాం అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారా నే సాధ్యం అయిందని అన్నారు…క్యాన్సర్ రోగులకు ఇది ఒక మంచి అవకాశం అని, ఉపయోగించు కోవాలని అన్నారు

ఈ కార్యక్రమంలో DMHO శ్రీదర్, సుపరిందెంట్ రాములు, డిప్యూటీ D M H శ్రీనివాస్, అర్ ఎం ఓ శ్రీధర్,.పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు మొగిలి, భోగ ప్రవీణ్, కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు ,కుసరి అనిల్, క్యాడాసు నవీన్, అల్లే గంగా సాగర్, బొడ్లా జగదీష్, కోరే గంగమల్లు, ముస్కు నారాయణ రెడ్డి,,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రంలు ప్రారంభం !
కొనుగోలు కేంద్రంలు ప్రారంభం !

బీర్ పూర్ మండల నరసింహుల పల్లే, తుంగురు, తాళ్ళ ధర్మారం, కొలవాయి గ్రామంలో పాక్స్, సేర్ఫ్ అధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీర్ పూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.