జగిత్యాల ,మెట్టుపల్లి పట్టణాల్లో
( J. Surender Kumar )
తేదీ 03-11-2022 గురువారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భముగా, డివిజన్ స్థాయిలో విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించనున్నట్టు జగిత్యాల జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ (S.E) జి సత్యనారాయణ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
03-11-2022, ఉదయము 10-00 am నుండి పగలు 1-30 pm. వరకు జరిగనున్నట్టు పేర్కొన్నారు.
విద్యుత్ సదస్సులు జరిగే స్థలం !
1.జగిత్యాల డివిజన్ ఆఫీస్ ఆవరణలో,
కరీంనగర్ రోడ్, జగిత్యాల లో.
2) మెట్టుపల్లి మండల్ పరిషత్ కార్యాలయ
ఆవరణలో,
అన్నమనేని గోపాల్ రావు, CMD/TSNPDCL/Warangal, ఆదేశాల ప్రకారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
విద్యుత్ వినియోగదారుల సదస్సులో అన్ని కేటగిరిలకు చెందిన వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుచున్నాము.
వినియోగదారుల సమస్యలు తెలుప గలరు మరియు విద్యుత్ ప్రమాదాల నివారణకు, భద్రత సూత్రాలు వివరించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.