₹12.14 కోట్ల తో కెనాల్ పనులకు భూమి పూజ
మంత్రి కొప్పుల ఈశ్వర్
(J. Surender Kumar)
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల నంది మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన కెనాల్ నిర్మాణం పనులకు బుధవారం భూమి పూజ చేశారు..
ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…
నూతన కెనాల్ ₹ 12.14 కోట్ల వ్యయంతో, నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు, ఈ కెనాల్ ద్వారా, సుమారు 20 గ్రామాల్లో 9,800 ,(తొమ్మిది వేల ఎనిమిది వందల) ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానున్నదని మంత్రి అన్నారు, కెనాల్ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి, భూమి కోల్పోతున్న వారిక నష్టపరిహారం అందించామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, సాగునీరు లేక, ఎడారిగా మారిందని, రాష్ట్ర అవతరణ తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆకుపచ్చ తెలంగాణగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు
మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు

సీఎం కేసీఆర్ దూర దృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నీటి కష్టాలను దూరం చేశారన్నారు, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి, సాగు నీరు అందని కరువు జిల్లాలకు సైతం నీరు అందిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
విద్యుత్ విషయంలో కూడా అద్భుతమైన ప్రగతిని, తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు, ఒకప్పుడు వ్యవసాయం లేని తెలంగాణలో, ప్రస్తుతం సాగు రంగంలో దేశంలోనే ఒక ప్రత్యేకత సాధించిందని మంత్రి గుర్తు చేశారు
ఈ సందర్భంగా సంవత్సర కాలంలోపు ఈ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి, రైతులకు సాగు నీరు అందించడం కోసం కృషి చేస్తామని ఇరిగేషన్ అధికారులు మంత్రి గారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సత్యా రాజ్ చంద్ర, ఈ ఈ ప్రసాద్, డీ ఈ కుమార్, సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, సర్పంచ్ సమంతుల జానకి తదితరులు పాల్గొన్నారు…
మంత్రి ఈశ్వర్ కు కృతజ్ఞతలు!
గోదావరి వరదల వల్ల చెడిపోయిన ధర్మపురి మండలంలోని లిఫ్ట్ మరమ్మత్తుల పనుల కోసం ₹ 303.60 కోట్లు. కేటాయించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి మండలం రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు సౌల భీమయ్య ,ఆయా ప్రాంతాల లిఫ్ట్ కమిటీల చైర్మన్ లు కృతజ్ఞతలు తెలిపారు.
రాజరం గ్రామ లిఫ్ట్ ₹49.75లక్షలు, జైనా గ్రామ లిఫ్ట్ కు ₹ 33 లక్షలు ,ఎడపెల్లి లిఫ్ట్ కి ₹ 49.50 లక్షలు, రాయపట్నం లిఫ్ట్₹ కి 71.50 లక్షలు, దొంతపూర్ లిఫ్ట్ ₹కి 99.85 లక్షలు, మరియు ధమ్మన్నపేట్ గ్రామ లిఫ్ట్ కి ఆన్ గోయింగ్ వర్క్ యధావిధిగా కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.