J. Surender Kumar
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు
రాష్ట్రంలో స్టడీ సర్కిల్ ల ఏర్పాటు చేసామని, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ 5 నెలల ఫౌండేషన్ కోర్సు శిక్షణ రెండవ బ్యాచ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఉండేదని, అందులో 200 సీట్ల కు పోటీ పడుతుంటే తెలంగాణ కు 15 శాతం, ఆంధ్ర ప్రాంతానికి 85 శాతం ఉండేది, తెలంగాణ ప్రాంతం చాలా తక్కువ కేటాయింపు జరుగుతుండేది అని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత నేడు జిల్లా కు ఒకటి, రెండు చొప్పున ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి ఘనత అని అన్నారు .

33 జిల్లాలు ఉంటే 33 స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయటం జరిగింది, ఇవే కాకుండా రాష్ట్రంలో త్వరలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ స్టడీ సర్కిల్ సైతం చేయనున్నట్లు ఆయన వివరించారు .
స్టడీ సర్కిల్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం వల్లనే, అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు, ప్రతి ఒక్కరూ హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ను, విద్యార్థులను చూసి ప్రేరణ పొందాలన్నారు.
రాష్ట్ర ఏర్పడి నూతన జిల్లాలు ఏర్పాటు చేయటం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1లక్ష 32 వేల ఉద్యోగాల భర్తీ, నూతనంగా 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు.

33 జిల్లాలకు మెడికల్ కాలేజీ ల కేటాయింపు, 965 రెసిడెన్షియల్ పాఠశాలల, ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టడం జరిగిందన్నారు
అలాగే జగిత్యాల స్టడీ సర్కిల్ మొదటి బ్యాచ్ లో వివిధ పోటీ పరీక్షల కు 463 మంది కోచింగ్ తీసుకోగా, అందులో 130 మంది ప్రిలిమినరీ అర్హత సాధించారు, అని వారికి మంత్రి ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ ఛైర్మెన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.