కరోనాలో లక్షలాది రూపాయల ఖర్చు ఎవరికోసం ?

కొండగట్టు ఆదాయం కొల్లగొడుతున్నది ఎవరు ?
అంజన్న సొమ్ము… అందినంత మింగు !

(J. Surender Kumar)

(పార్ట్ – 2)

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 2020 ఆర్థిక సంవత్సరంలో, 202 (రెండు వందల రెండు) రోజులపాటు మూసి ఉన్న, నిర్వహణ పేరిట లక్షలాది రూపాయల ఖర్చులు ఎలా చేశారు ? ఎవరి కోసం చేశారో.? అంతు పట్టని మిస్టరీగా. మిగిలింది. రికార్డులలో నమోదైన ఖర్చుల వివరాలు మాత్రం అంజన్న భక్తులను ఆయోమయంతో పాటు, ఆందోళనకు గురిచేస్తు  వారిని నివ్వెర పరుస్తున్నాయి అనేది మాత్రం నిజం.


152 రోజులు  కలుపుకొని దాదాపు ₹ 40,07,775/-  ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి!

తేదీ.11-10-2020  నుంచి .31-3-2021 వరకు ఆలయం తెరిచి ఉంది.  తిరిగి తేది 1-4-2021 నుంచి  30-6-2021, వరకు లాక్ డౌన్ విధించారు (ఆలయాలు మూసి ఉన్నాయి)  కొన్ని పద్దులలో ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి!
*తడుకలు మరియు పందిళ్లు ₹ 3,24,706/-  * కేశఖండన శాల నిర్వహణ  ₹ 1,36,209/-  *  శ్రీ హనుమాన్ జయంతి ₹ 2,07,255/-  * వార్షిక పండుగలు ₹ 3,07,755/- .* విద్యుత్తు దీపాలంకరణ  ₹ 86,800/-  *  కరెంటు సామాగ్రి 500/-  *వాటర్ సప్లై సామాను ఖరీదు నిర్వహణ ₹ 1,31,973/- * యం  అండ్  ఆర్ వర్క్స్  ₹1,73,986/- * గోశాల నిర్వహణ ₹ 1,20,350/-  * టి ఏ మరియు డి ఏ బిల్లులు  ₹ 4,880/- * కారు అలవెన్స్ ₹ 2,94,500/-  * నూతన కట్టడాలు  ₹ 15,36,424/- *  కరెంటు & వాటర్ సప్లై సామాగ్రి  ₹,1,84,305/-. * కరెంటు సామాగ్రి ఖరీదు ₹ 89,000/- * ఆగమ పాఠశాల నిర్వహణ  ₹ 4,06,152/- *  గార్డెన్ నిర్వహణ. ₹ 2,880/- తదితర వాటికి (కొన్ని మాత్రమే) ఖర్చు చేసినట్టు   ఆలయ రికార్డులలో నమోదయింది.

ఆలయం మూసి ఉన్న ఆ ఖర్చులు ఎవరికోసం ?

కరోనా నేపథ్యంలో మూసి ఉన్న ఆలయంలో వీఐపీ ప్రోటోకాల్, ధర్మకర్తల టి ఏ డి ఏ, ధర్మశాల నిర్వహణ, చలివేంద్రాలు, పేరిట రికార్డులలో ఎలాంటి ఖర్చులు నమోదు  చేయనట్టు సమాచారం. .అయితే వాటర్ సప్లై సామాగ్రి ఖరీదు నిర్వహణ పేరిట.₹ 1,31,973/-ఖర్చు అయినట్టు నమోదు చేయగా, మరోసారి కరెంటు మరియు వాటర్ సప్లై సామాగ్రి కొనుగోలు పేరిట ₹ 1,84,305/-  అదనంగా కరెంటు సామాగ్రి కొనుగోలు పేరిట ₹ 89,000/- ఖర్చుల వివరాలు నమోదు చేశారు.

దీనికి తోడు. అధికారి కారు అలవెన్స్ పేరిట ₹ 2,94,500/-  డిఎడిఎ బిల్లులు 4,880/- గార్డెన్ నిర్వహణ పేరిట ₹ 2,880/- ఫర్నిచర్ కొనుగోలు పేరిట ₹24,010/- కరోనా, లాక్ డౌన్ లో ఆగమ పాఠశాల నిర్వహణ ఎలా  జరిగింది ?  నిర్వహణ పేరిట ₹ 4, 06,152/- ఖర్చు అయినట్లు నమోదు చేయడం తో భక్తజనం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.