శుక్రవారం నుంచి ధనుర్మాస ఉత్సవలు !

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో..

నెలరోజులపాటు ఉదయత్ పూర్వం పూజలు!

(J. Surender Kumar)

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ధనుర్మాస పూజాది కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి.
ఈనెల 16 నుంచి 2023 జనవరి 14 వరకు ఈ పూజలు జరగనున్నాయి. ఉదయం 3 గంటలకు, అర్చక స్వాములు మంగళ వాయిద్యాలతో, గోదావరి నది పవిత్ర జలాలను తెచ్చి స్వామివారికి అభిషేకం, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుండి.5-30 వరకు పూజలు, అర్చనాధి కార్యక్రమాలు జరుగుతాయి.

అర్చక స్వాములు, తిరుప్పావై ,ప్రబంధములు ప్రవచనం చేస్తారు. స్వామివారికి పొంగల్ నైవేద్యం సమర్పిస్తారు. పగలు 2- 30 నిమిషాల నుంచి 4-00 గంటల వరకు ఆలయం మూసి ఉంచుతారు.
లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా
నూతన సంవత్సరం జనవరి 2న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, జనవరి 13న గోదా కళ్యాణం జరగనున్నాయి.
ధనుర్మాసంలో స్వామివారి ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోతుంది.