అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ …..అక్కడ ఓ చిన్న తోటలో …. రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు. ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..
ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన ఉదంతం చూసి చలించిపోయాడు. నేలమీద పరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు. .శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండా నీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటిన మట్టిని తీసుకొని “ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను” అంటూ ప్రతిజ్ఞ చేశాడు
. . దీనికి కారకుడైన జనరల్ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవకార్యక్రమా లలో పాల్గొన్నాడు.
జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయన మవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేసారు. కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్ డయ్యర్ ను వెంటాడ సాగాడు.. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.
ఆరోజు 1940 జూలై 13….
డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. ఆ సమాచారం ఆయువకునికి అందింది… వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు.ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో ఫిస్టల్ దాచాడు..అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు
డయ్యర్ సభకు వెళ్ళాడు…

సభ ప్రారంభమైంది.. డయ్యర్ ను వీరుడు,.ధీరుడంటూ ఆంగ్లేయులు పొగుడుతున్నారు… అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..
రక్త మడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.. కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు. ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది…ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు.ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళ్తున్నాడు.. నిషితంగా గమనిస్తున్న డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ అప్రమత్తమ య్యేందుకు లేచాడు. అంతే ఆ యువకుడు పుస్తకంలోని పిష్టల్ మెరుపు వేగంతో తీసి, అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు.. భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు.
వేలమందిని చంపి భారతీయులు నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో… ఆతను జనరల్ డయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు. డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.. ఇంకా నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడాయువకుడు.
ఆయనే ఉద్దమ్ సింగ్.
ఆయన పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా లోని సునం తెహసీల్ కు చెందిన కలన్ గ్రామంలో డిసెంబరు 26, 1899 జన్మించాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరుడ్ని కోల్పోయిన ఉద్ధమ్ సింగ్ నర నరాన దేశ భక్తి జీర్ణించుకుపోయింది. అనాథ శరణాలయంలో పెరిగిన ఆయన.. 10 వ తరగతి వరకూ చదువుకున్నారు. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి భగత్ సింగ్తో కలిసి గదర్ పార్టీలో చేరారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నారనే ఆరోపణలతో జైలుకు వెళ్లిన ఉద్ధమ్ సింగ్ ఐదేళ్ల తర్వాత విడుదలయ్యారు. బయటికి వచ్చిన తరవాత మారువేషంలో కశ్మీర్కు.. అక్కడ నుంచి జర్మనీ గుండా లండన్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి జనరల్ ఓ డయ్యర్ కోసం వేట ప్రారంభించి.. చివరికి 1940 మార్చి 13 న మట్టుబెట్టారు. పోలీసులకు స్వయంగా లొంగిపోవడంతో హత్యచేసినట్టు అంగీకరించారు. దాంతో 1940 జులై 31 బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో ఉరితీసింది.
ఉద్దమ్ సింగ్ తన పేరును రాం, మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ,మార్చుకున్నాడు.ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రగణ్యుడు) గా వ్యవహరిస్తారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా నేటి యువ తరానికి ఆనాటి త్యాగధనుల గురించి తెలియ జేయాల్సిన అవసరం ఉంది.
దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడంలో పలువురు కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమం కూడా పలు రూపాల్లో జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభ మయిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ అకస్మాత్తుగా ఆపివేయడంతో ఆనాటి అనేకమంది యువ స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు విప్లవ బాట పట్టారు.
వ్యాసకర్త:
యం.రాం ప్రదీప్ తిరువూరు 9492712836