ఆన్లైన్ టెండర్ పేరిట అడ్డగోలు దోపిడినీ అరికట్టండి !
కోట్లాది రూపాయలు ఆదాయం కొల్లగొడుతున్నారు !
అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు లేరు!
ఆన్లైన్ టెండర్ విధానం రద్దు చేయండి!
(J. Surender Kumar)
ప్రముఖ ఆలయాలలో కోట్లాది రూపాయల ఆదాయం హారతి కర్పూరంలా ఆవిరవుతున్నది. ఆన్లైన్ టెండర్ అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. తెలంగాణ లో కొలువై ఉన్న దేవుళ్ళు పట్ట పగలు, నిట్టనిలువు దోపిడికి గురి అవుతున్న, అడిగేవారు, అడ్డుకునేవారు అగుపించడం లేదు. సంవత్సరాల తరబడి ఆన్లైన్ టెండర్ ముసుగులో దోపిడి కొనసాగిస్తున్న వారిని ప్రశ్నించిన ఆక్షేపణలు తెలిపిన, వారు వీళ్ళను పచ్చ నోట్లతో ప్రసన్నం చేసుకుంటూ, తమ దోపిడిని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దైవ భక్తి పరాయణుడు సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని తెలంగాణ లో కొలువై ఉన్న దేవుళ్ళ ఆదాయం కాపాడడంతోపాటు, ఆన్లైన్ టెండర్ల ద్వారా సరుకులో కొనుగోలు విధానం రద్దు చేయాల్సిందిగా భక్తజనం ముక్తకంఠంతో కెసిఆర్ ను కోరుతున్నారు.
వివరాల్లోకి వెళితే!
రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, భద్రకాళి తదితర మరికొన్ని ఆలయాలలో ఆన్లైన్ టెండర్ల ద్వారా సరుకులు కొనుగోలు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది.
ఆయా ఆలయాల్లో కొలువై ఉన్న దేవుళ్లకు నిత్య నివేదన భక్తులకు ప్రసాదాలు, స్వామి వారి ప్రసాదాల విక్రయం, ఉచిత అన్నదానం, తదితరాల అవసరాల నిమిత్తం, పంచదార, బియ్యం, నూనె, నెయ్యి, పప్పు ఉప్పు తదితర సరుకులు కొనుగోలు చేస్తుంటారు.
ఆర్థిక సంవత్సర కాలానికి సరుకులు! ధరల వివరాలు. గోప్యం!
ఆలయానికి సరుకులను సప్లై చేసేవారు, ఆన్లైన్ టెండర్
ద్వారా ధరలను కొట్ చేయాల్సి ఉంటుంది. వాటి వివరాలు ఆలయ ఈవోకు, టెండర్ దారుడికె తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. (కొందరు అధికారులు, వ్యాపార సంస్థ లు రూపొందించిన టెండర్ నియమ నిబంధనలు ప్రకారం రాష్ట్రంలో కేవలం మూడు సంస్థలే టెండర్ లో పాల్గొనే అర్హతలు కలిగి ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి) గత కొన్ని సంవత్సరాలుగా మూడు సంస్థలే ఆన్లైన్ టెండర్ లో పాల్గొనడం అందులో ఒకరు తక్కువ కోట్ చేసి సరుకుల సప్లై టెండర్ దక్కించుకోవడం మిగతా రెండు సంస్థలు వారి బినామీ సంస్థలు అనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్ నిబంధనలు కొన్ని ఇలా!
టెండర్ దారుడు, ఫుడ్ గ్రేన్ వ్యాపారంలో రిజిస్టర్ అయి ఉండాలి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి!
EMD, డబ్బులు. ₹ 15 లక్షల రూపాయలు ఆయా ఆలయ కార్యనిర్వహణాధికారి పేరిట నేషనల్ బ్యాంకులో డిడి తీయాలి. టెండర్ పొందినవారు సంవత్సర కాల పరిమితి ముగిసిన తరువాత EMD డబ్బులు తిరిగి పొందడానికి అవకాశం!
టెండర్ షెడ్యూల్ ఫామ్ ధర ₹ 3000/-
బియ్యం, పంచదార, శనగపప్పు, ఖజు ,ఎండు ఖర్జూర, నూనెల తదితర వ్యాపారంలో సాలిన కనీసం ₹ 10 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలం పాటు కలిగి ఉండాలి!
గ్రేడ్ వన్ ఆలయాలనికి సాలీనా ₹ 5 కోట్లు, వ్యాపార లావాదేవీలు కలిగిన వారు అర్హులు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ,నుంచి డిప్యూటీ కమిషనర్ హోదా గల ఆలయాలకు ₹ 10 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉండాలి. రీజినల్ జాయింట్ కమిషనర్ హోదా గల ఆలయాలకు ₹ 25 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నవారే ఆయా ఆలయాల్లో టెండర్లు పాల్గొనడానికి అర్హతగా ప్రకటించారు.
₹ 5. ₹10, ₹ 25 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ప్రతి ఆర్థిక మూడు సంవత్సరములకు వాణిజ్య పనుల శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ( సర్టిఫికెట్ ) జతపరిచాల్సి ఉంటుంది. ఈ ధ్రువీకరణ జతపత్యాల్సి ఉంటుంది .
మూడు సంవత్సరల కాల అనుభవం, సరఫరా సక్రమంగా చేస్తున్నాడంటూ ప్రభుత్వ సంస్థలచే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి సమర్పించాల్సి ఉంటుంది.
సంస్థ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇన్కమ్ టాక్స్ కాపీ, వ్యాపారంలో లాభనష్టాల ఆడిట్ నివేదిక,. మూడు ఆర్థిక సంవత్సర అమ్మకాలు, వ్యాపార లావాదేవీల, వివరాలు దానిపై కమర్షియల్ టాక్స్ అధికారి అట్టేస్టేషన్ చేయించి జతపరిచాల్సి ఉంటుంది.
ఆగా మార్క్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫుడ్ గ్రేన్ వ్యాపారం బియ్యం,పప్పులు, హోల్సేల్ ఖజు, పల్లి గింజలు, ఆయిల్ గింజలు, FSSAI లైసెన్స్ సమర్పించాలి.
200 మెట్రిక్ టన్నుల, బియ్యం 100 మెట్రిక్ టన్నుల, శనగపప్పు 6 మెట్రిక్ టన్నుల ఖాజూ (రెండు పలుకులు గలది).20 మెసేజ్ ఎండుఖర్జూర పండ్లు, పలుకులు (రెండు పలుకులు కలిగి ఉన్నది) 2 మెట్రిక్ టన్నుల చింతపండు, 150. మెట్రిక్ టన్నుల పంచదార, 6 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూర, గత రెండు ఆర్థిక సంవత్సరాలలో సరఫరా చేసినట్టు చార్టెడ్ అకౌంటెంట్ ధ్రువీకరించిన పత్రం జతపరిచాల్సి ఉంటుంది.
ఆలయాలకు సరఫరా చేసే సామాగ్రి టెండర్ లో అర్హతలు నిబంధనలు (స్టాక్) తదితర నిబంధనల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాకు. చెందిన ఏ ఒక్క వ్యాపారి గాని,వ్యాపార సంస్థ గాని టెండర్లు పాల్గొనలేదని సమాచారం. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ తన మరో రెండు బినామీ సంస్థలతో ఆన్ లైన్ టెండర్ లో పాల్గొని కైవసం చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయాలకు సరఫరా అవుతున్న సామాగ్రి అధిక ధరలు ఉండగా అవే సామాగ్రి మార్కెట్లో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్న వాటిని కొనుగోలు చేయకుండా సరఫరా చేసే సంస్థకు అధిక ధరలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరుకుల వివరాలు, క్వాలిటీ, క్వాంటిటీ సంబంధిత ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు, సరఫరా చేసే సంస్థకు మాత్రమే తెలుసని ధర్మకర్తలకు, ఉద్యోగులకు తెలిసే అవకాశం లేకుండా కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి నెల 3 నుంచి 5 లక్షలకు పైగా ఆదాయానికి గండి!
ప్రత్యేకంగా ప్రముఖ ఆలయాలు దాదాపు 20 కి పైగా ప్రతినెల ప్రసాదాల సరుకుల కొనుగోలు లో.₹ 3 లక్షల నుండి 5 లక్షలకు పైగా ఒక్కొక్క ఆలయం సరుకుల కొనుగోలులో మార్కెట్ ధరల కన్నా అధిక ధరలు చెల్లిస్తూ ఆలయాల ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా కొన్ని ఆలయాల అధికారులు 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్లైన్ టెండర్ల ప్రకటనలు జారీ చేస్తున్నారు. భద్రకాళి , కాలేశ్వరం, మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారు సరుకుల కొనుగోలు. కోసం పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు.

వేములవాడ కొండగట్టు బాసర ధర్మపురి తదితర ఆలయాలు ఈనెల 20 లోగా టెండర్ ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి.. ప్రస్తుతానికి సరుకుల సప్లయర్ టెండర్ కాలపరిమితి 2023 మార్చి 31 వరకు ఉంది.

శ్రీశైలం ఆలయంలో సరుకుల కొనుగోలులో అవినీతి!
పాలక వర్గ చైర్మన్ చక్రపాణి రెడ్డి వెల్లడి!

ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో లడ్డు తయారీలో దాదాపు 42 లక్షల రూపాయల అవినీతి జరిగిందని ఆలయ పాలక చేర్మెన్ చక్రపాణి రెడ్డి బుధవారం ఏపీప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
లడ్డు తయారీకి సరఫరా చేస్తున్న సరుకు నాణ్యత ప్రమాణాలు లేవని, మార్కెట్ ధర కంటే అధిక ధరలు ఉన్నాయని చక్రపాణి రెడ్డి ఆరోపించారు. గత అక్టోబర్ లో సరుకులు సరఫరా టెండర్ రద్దు చేస్తూ పాలకవర్గం తీర్మానం చేసినట్టు ఆరోపించారు. నవంబర్ మాసంలోనే దాదాపు ₹ 42 లక్షల రూపాయల దుర్వినియోగం జరిగిందని, ఫిబ్రవరి మాసం వరకు కోటి రూపాయలకు దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
(ఆన్లైన్ సరుకుల కొనుగోలుకు జీవో లేదా ? సర్కులర్ అడ్డుపెట్టుకొని చేస్తున్నారా? ఆదాయ గండి తీరు తెన్నులు త్వరలో..)