కేరళ హైకోర్టు ఆదేశాలతో..
J. Surender Kumar ,
నాణ్యత ప్రమాణాలు లేని ప్రసాదాలను, భక్తులకు ఎలా పంపిణీ చేస్తారంటూ ? హైకోర్టు ఆలయ అధికారులు హెచ్చరించడంతో దాదాపు ₹ 7 కోట్ల విలువ గల ప్రసాదాలను పంపిణీ చేయకుండా 6,65,159 సీల్డ్ ప్రసాదాల డబ్బాలను ధ్వంసం చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ లో భక్తులకు, అరవన్న పాయసం (ప్రసాదాలు) ఉచిత పంపిణీ తో పాటు విక్రయిస్తారు, ఈ ప్రసాదాలను సాంకేతిక,వైజ్ఞానిక పరిజ్ఞానంతో పాటు నాణ్యత ప్రమాణాలు సరుకులను వినియోగించి తయారు చేస్తారు.
ప్రసాదాల తయారీలో వినియోగించే సరుకులలో ఒకటైన యాలకులలో 14 రకాల పురుగులు మందు అవశేషాలు ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకొని, జనవరి మొదటివారం లో తక్షణం ప్రసాదంగా పంపిణీ నిలుపుదల చేయాలని శబరిమలై దేవస్థానం బోర్డును హైకోర్టు న్యాయమూర్తులు ఆదేశించారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న దాదాపు 6 లక్షల 65 వేలకు పైగా ఉన్న ప్రసాదల నిల్వ డబ్బాలను సీజ్ చేసింది.
హైకోర్టులో కేసు ఇలా!

యాలకుల కొనుగోలు కోసం గత కొన్ని నెలల క్రితం శబరిమలై దేవస్థానం టెండర్ ప్రకటన జారీ చేశారు. వేలం ద్వారానే యాలకులు కొనుగోలు చేశారు. ఈ వేలంలో. టెండర్ దక్కని మరో వ్యాపార సంస్థ ‘అయ్యప్ప స్పేస్ ఏజెన్సీ’ అరవన్నపాయస తయారీలో నాసిరకం యాలకులు వినియోగిస్తున్నారు అనే ఆరోపణలతో కేరళ హైకోర్టులో కేసు వేశారు.
పాయసంలో ఉపయోగించే యాలకుల నాణ్యత ప్రమాణాలు పరీక్షించాలని కోర్టు ఆదేశించింది. తిరువనంతపురంలోని ,’ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ‘ అరవనపాయసం పరీక్షించారు. నివేదికలో షాకింగ్ సమాచారం వెల్లడైంది. అరవనిపాయసంలో వాడే యాలకులలో అనుమతించిన దానికంటే ఎక్కువ మోతాదులో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్టు నివేదికలో వెళ్లడైంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన న్యాయస్థానం ‘ మీరు భక్తులకు కలుషిత పూరిత మైన ప్రసాదాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.’
దీనిపై దేవసం బోర్డు స్పందిస్తూ.. కొనుగోలు చేసిన యాలకులు సరిపోకపోవడంతో, స్థానిక మార్కెట్ నుంచి మళ్లీ యాలకులను కొనుగోలు చేశామని, అందుకే ఈ సమస్య తలెత్తిందని హైకోర్టుకు తెలిపారు. తాము ఇలాంటి సమాధానాలు అంగీకరించబోమని, అంగీకరించలేమని, భక్తులకు ఇలాంటి ప్రసాదాలు పంపిణీ చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. భక్తుల సంక్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అన్నారు. దీంతో దేవస్థానం బోర్డు దాదాపు 6 లక్షల టిన్నుల(డబ్బాల) అరవన్న పాయసం నిల్వలు ఉన్నాయని (స్టాక్) బోర్డు కోర్టుకు వివరించారు. నిలువ ఉన్న మొత్తం ప్రసాదాన్ని తక్షణమే సీల్ చేయాలని, మరియు భక్తులకు పంపిణీ చేయకుండా పూర్తిగా ధ్వంసం చేసేలా చూడాలని దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శబరిమల భక్తులకు అరవన్న పాయసం ప్రసాదాల కొరత ఏర్పడుతుందని దేవస్థానం బోర్డు మరోసారి కోర్టుకు వివరించారు. నాణ్యత ప్రమాణాలు గల సరుకులతో యాలకులు వాడకుండానే తాజాగా పాయసం తయారు చేసి ఇవ్వాలని దేవసం బోర్డును ఆదేశించడంతో యాలకులు లేని అరవన్నపాయ తయారుచేసి పంపిణీ చేశారు.