ప్రజాభిక్షం మేరకే మాస్టర్ ప్లాన్ ఉంటుంది! ముసాయిదా మాత్రమే!

ఏ ఒక్కరికి ఇబ్బందులు ఉండవు !

అభ్యంతరాలకు 60 రోజులు సమయం !

రెచ్చగొట్టే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి!
ప్రజలకు నేనే అండగా ఉంటా!

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

J. Surender Kumar

జగిత్యాల మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అంశంపై మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించి ఓ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.
1989 లొ జగిత్యాల పట్టణంలో పుప్పాల ఆశాలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే విజయపురి, గాంధీ నగర్ పరిసర ప్రాంతాలను కలిపి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు అని పేర్కొన్నారు.
చింత కుంట కింద ప్లే, పార్క్ జోన్ ఉండేదని, విజయ పురి వైపు రైల్వే జోన్ ఉండేదని….గోవింద్ పల్లి వైపు హాస్పిటల్ జోన్ ఉండేదని అన్నారు…

జగిత్యాల పట్టణంలో చట్టబద్ద అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం..దేశంలోనే పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ పెరుగుతున్న జనాభా కి తగినట్లు గా రాష్ట్రం అంతటా మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు నిర్ణయం మాత్రమే తీసుకోవడం జరిగింది.
యావర్ రోడ్డు లో దాదాపు వెయ్యి మీటర్లు రోడ్డు వెడల్పు చేయటం జరిగింది. నేడు ప్రజలు 100 ఫీట్ లతో నిర్మాణాలు..ఢిల్లీ సంస్థ ద్వారా నే సర్వే జరపడం జరిగింది. .మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీ లు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయటం జరిగింది, దాదాపు 60 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ .ప్రతిపక్ష అసత్య మాటలు నమ్మవద్దని, ఆగం కావద్దని అన్నారు.
ప్రజల పక్షాన ఉంటామని ప్రజలను న్యాయం చేస్తామని అన్నారు… ప్రజాభిక్షం మేరకే మాస్టర్ ప్లాన్ ఉంటుందని, ఇది కేవలం ముసాయిదా అని 60 రోజులు అభ్యంతరాలు సమయం ఉంటుందని, ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రకటనలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.