ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J. SURENDER KUMAR,

విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కఠోర సాధన చేయాలని, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 
ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ అందించాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించారని, ఇది సాహోసోపేతమైన నిర్ణయం అని,
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఇంత గొప్పగా చేస్తున్న దాఖలాలు లేవని మంత్రి అన్నారు
.

జగిత్యాల జిల్లా చల్ గల్  గ్రామంలోని జిల్లా మండల ప్రజాపరిషత్ పాఠశాలలో 17.95లక్షలతో మన ఊరు మన బడి కంపొనెంట్ పనులను, ఎన్.ఆర్.జి.ఎస్. క్రింద 61 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, స్థానిక శాసన సభ్యులు సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ లతో కలిసి ప్రారంభించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.
తెలంగాణ రాక పూర్వం  పరిస్థితులను బేరీజు వేసుకోవాలని , ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ విద్యా విధానం తీసుకొచ్చిన తర్వాత సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదలకు విద్యా అవకాశాలు పెరిగాయని, 5వ తరగతి నుంచి డీగ్రి వరకు తల్లిదండ్రుల పైభారం పడకుండా  కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం ఉచితంగాఅందిస్తుందని అన్నారు.
మన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అద్బుత విజయాలను సాధిస్తున్నారని, దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలలో సీట్లు వస్తున్నాయని, నీట్, ఐఐటి వంటి అనేక పోటీ పరీక్షలలో నెగ్గుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
మన రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలలో వోకేషనల్ కోర్సులు సైతం ప్రారంభించామని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పాఠశాలల అభివృద్ధి చేసేందుకు  7 వేల కోట్లకు పైగా వ్యయంతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని అన్నారు.  పత్తిపాక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేసామని, విద్యార్థుల కోసం అదనంగా డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఎవరికైనా ఆత్మ విశ్వాసం చాలా అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలో ఏ రంగంలోనైనా రాణించగలమనే  విశ్వాసం పెంచుకోవాలని,  అభద్రత భావం , అనుమానాలను తీసివేయాలి అని మంత్రి సూచించారు.


ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన మంచి టీచర్లు ఉన్నారని, పిల్లలు వారిని సంపూర్ణంగా ఉపయోగించుకొని  ఎదగాలని అన్నారు.  పదవ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ లో 60 మార్కులకు పైగా సాధించి ఉత్తీర్ణత కావాలని, ఆదిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని  మంత్రి సూచించారు. పాఠశాలలో సిసి రోడ్డు నిర్మాణానికి మంత్రి 15 లక్షలు మంజూరు చేశారు.
విద్యార్థులుకు చదువు తప్ప వేరే ఏ ధ్యాస ఉండకూడదని, మంచి లక్ష్యాలను నిర్దేశించుకోని పట్టుదలతో సాధించాలని అన్నారు. మన లక్ష్యం గొప్పగా ఉన్నప్పుడే మనం జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని,  విద్యార్థులంతా మంచి స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.