ఈడి ముందుకు ఎమ్మెల్సీ కవిత.. హజరా ?  గైరాజరా ?…

J.SURENDER KUMAR,

ఈ డి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత, సోమవారం ఢిల్లీలోని అధికారుల ముందు హాజరు అవుతారా ? లేక గైర్హాజర్ అవుతారా ? అనే చర్చ జరుగుతుంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పలువురిని విచారిస్తున్న సిబిఐ, ఈడి అధికారులు, కొందరిని అరెస్టు చేయగా, మరికొందరిని విచారణ కు  కార్యాలయానికి రావలసిందిగా నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత మార్చి 11న విచారణకు హాజరయ్యారు. తిరిగి 16న రావలసిందిగా నోటీసులు జారీ చేయగా, ఆమె సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. మార్చి 24న ఎమ్మెల్సీ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు అంగీకారం తెలిపింది. తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నందున, తాను స్వయంగా విచారణకు హాజరు కాలేనని, కోరిన డాక్యుమెంట్ల ను న్యాయవాది ద్వారా పంపించి విచారణకు హాజరు కాలేదు..ఈ డికి లేఖను రాశారు. ఈ డి అధికారులు 20 మార్చిన రావలసిందిగా ఎమ్మెల్సీ కవితకు జారీ చేసిన విషయం తెలిసిందే.

చర్చలే చర్చలు!
సుప్రీంకోర్టు లో పిటీషన్ పెండింగ్ లో ఉందని 16 న ఈ. డీ  అధికారులకు న్యాయవాది ద్వారా లేఖ పంపి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పక ముందే హాజరవుతారా ? అనేది చర్చ.
ఈ అంశంలో ప్రముఖ న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రచార సాధనాలలో, చర్చలు డిబేట్లతో,  లిక్కర్ కుంభకోణం టి20 క్రికెట్ మ్యాచ్ మరిపించేలా చర్చలకు ఆస్కారం ఏర్పడిందని చెప్పవచ్చు.  ఈ. డీ ముందు హాజరవుతారా ?  గైరాజరవుతారా ? అనే ఉత్కంఠ అంశానికి  ఈరోజు పగలు 12 గంటల్లోపు తెరపడనున్నది.

16న ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ
6 పేజీలో లేఖ


E.D కార్యాలయంలో విచారణకు హాజరు కాకుండా, తన న్యాయవాది ద్వారా E.D అధికారులకు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలో పలు కీలక అంశాలను, న్యాయస్థానాల తీర్పులను పేర్కొంటూ 6 పేజీల లేఖ లో ఆమె 16 అంశాలు పేర్కొంది.
👉 మహిళలను ఆఫీస్‌కు పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధంగానే ఉన్నాను.
👉 అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని ఇదివరకే మీకు చెప్పాను.
👉 అయితే నా విజ్ఞప్తిని మీరు అంగీకరించలేదు. ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగాపెట్టి నన్ను ప్రశ్నించాలని చెప్పారు.
👉 చట్టప్రకారం నాకు హక్కులు ఉన్నప్పటికీ మీ మాటను అంగీరించి ఈనెల 11న జరిగిన విచారణకు హాజరై పూర్తిగా సహకరించాను.
👉 మీరు (ఈడీ అధికారులు) అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలిచ్చాను.
👉 అయినా చట్ట విరద్ధంగా నా ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ నేరంతో నా ఫోన్‌కు ఏం సంబంధమో కూడా చెప్పలేదు.
👉 మీ చర్య నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించింది.
👉 ఈనెల 11న రాత్రి 8:30 గంటల వరకు ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. మళ్లీ విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు.
👉 వ్యక్తిగతంగా (In Person) రావాలని మీరు ఇచ్చిన సమన్లలో ఎక్కడా పేర్కొనలేదు.
👉 అందుకే మీరు అడిగిన డాక్యుమెంట్లతో నా ప్రతినిధి సోమా భరత్‌ ద్వారా పంపుతున్నాను.
👉 ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అయితే 11న మీరు మాట తప్పారు.
👉 ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగా విచారించడానికే నేను వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పినా.. అలాంటిదేమీ జరగలేదు.
👉 ఎందుకని నేను అడిగిన ప్రశ్నలకు మా ప్లాన్ మార్చుకున్నామని మీ అధికారులు (ఈడీ అధికారులు) చెప్పారు.
👉 దీంతో విచారణ చట్టబద్ధంగా జరగలేదని నేను భావిస్తున్నాను. అందుకే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను.
👉 ఈ పిటిషన్ ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. కనుక సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు వచ్చే వరకు ఈడీ సమన్ల విషయంలో వేచి ఉండాలి.
👉 ఈడీ ముందు మహిళ విచారణకు హాజరుకావడంపై కూడా పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది.
👉 కనుక తదుపరి ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ వాయిదా వేయమని కోరుతున్నాను.
👉 ప్రజాప్రతినిధిగా, ఒక మహిళగా నాకు ఉన్న హక్కులను హరించరాదు’ అని ఈడీకి పంపిన లేఖలో కవిత వివరంగా రాసుకొచ్చారు.