జర్నలిస్ట్ మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి !

కలెక్టర్ కు TUWJ (IJU) జిల్లా శాఖ వినతి !


J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా పరిధిలో మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబలకు అందాల్సిన పరిహారం జాప్యంను నిరసిస్తూ TUWJ (IJU) జాతీయ కౌన్సిల్ సభ్యులు సురేందర్ కుమార్ ఆధ్వర్యంలో TUWJ (IJU) జిల్లా శాఖ తరుపున సోమవారం జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో మరణించిన సుమారు 10 జర్నలిస్ట్ ల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ నుంచి అందాల్సిన రూ.1 లక్ష పరిహారం, నెలకు అందల్సిన రూ.3000/- పెన్షన్ ఏడాది గడిచిన బాధిత కుటుంబాలకు అందడం లేదన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రెస్ అకాడమికి ఈ పరిహారం జాప్యం పై విజ్ఞప్తి చేసినప్పటికి అకాడమీ స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి, దీన స్థితిలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందక, ఆర్థికంగా చితికిపోయిన మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటూన్నాయన్నారు. జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఈనెల 30 లోపు పరిహారం అందేలా చూడాలని, లేని పక్షం లో ప్రజాస్వామ్య పద్దతిలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. బాధిత కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందేలా చూడాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో TUWJ సంఘ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి మోరపల్లి ప్రదీప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పూడూరి శోభన్, పాత్రికేయులు సామ మహేష్, సాబీర్ తదితరులున్నారు.