జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !
J. Surender Kumar,
మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు శిక్షతో పాటు ప్రమాదాలకు కారణం అయితే సెక్షన్ 304-II కేసు లు నమోదు చేస్తామని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎక్కడి భాస్కర్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫిబ్రవరి నెలలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 690 మంది వ్యక్తులకు పట్టుకోవడం జరిగింది. పిబ్రవరి నెలలో మరియు పాత నేరలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ 1454 మంది వ్యక్తులకు కోర్టు ద్వారా జరిమాన లు విధించడం జరిగింది జరుగుతుందని తెలిపారు. జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు , ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లదండ్రులకు బాధ్యత వహంచాలనీ హెచ్చరించారు.వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.