ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత లేఖ!
ఫోన్ల ధ్వంసం ఆరోపణ ఖండించిన కవిత !
J.Surender Kumar,
న్యూఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికార నివాసం నుంచి ఈడి కార్యాలయానికి విచారణకు వెళుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం మీడియా తో మాట్లాడకుండా రెండు ప్లాస్టిక్ కవర్లలో సెల్ ఫోన్ లను చేతులతో మీడియాకు చూపిస్తూ ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడి కార్యాలయంలో విచారణ అధికారి తాను ఫోన్లో ధ్వంసం చేశాను అంటూ మీడియాకు లీకులు ఇస్తూ అప్రతిష్ట చేస్తున్న అంశంపై అధికారులను ఘాటుగా రాసిన లేఖను లో తూర్పారపట్టరు.

లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి…
మీరు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను.
ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ?
దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ, నేను ఫోన్లు ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా, లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ?

నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే అని లేఖ లో పేర్కొంది
తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు

అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం.
అంటూ లేఖలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.