J.Surender Kumar.
మోడీ సైన్యంలో ఒక సైనికురాలిగా పనిచేస్తానని బిజెపిలో చేరిన అనంతరం జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణి అన్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటెల రాజేందర్ భోగ శ్రావణి ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు భోగ శ్రావణి నేడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బుధవారం బిజెపి సభ్యత్వాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
జగిత్యాల ఎమ్మెల్యే అణచివేతకు గురై, కన్నీరు పెట్టుకొని తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానన్నారు. తాను కన్నీటితో రాజీనామా చేసినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ నుండి తనకు ఎలాంటి ఓదార్పు లభించలేదని, అయితే ఒక ఆడబిడ్డగా తనను అక్కున చేర్చుకున్న బిజెపి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భరోసా కల్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతమాత సేవ చేసేందుకు ఒక సైనికురాలిగా పని పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో బిజెపి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు మోర పెళ్లి సత్యనారాయణ రావు తదితరులు ఉన్నారు.