3లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా?

టీ పిసిసి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లో శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మెటుపల్లి – ముత్యంపేట లో పర్యటించారు. ఆయనతోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు.

కామెంట్స్…
3లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? చక్కెర కర్మాగారాన్ని కూడా నడిపించలేని కేసీఆర్ రాష్ట్రాన్ని నడపలేరు. కేసీఆర్ కు ఇక ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. హర్యానా మాదిరిగా ఇక్కడి రైతులు లాభసాటి పంటలు పండిస్తారు. పదిమందికి పని కల్పించి, పట్టెడన్నం పెట్టి ఆదుకుంటున్నారు ఇక్కడి రైతులు. గోదావరి జిల్లాల కంటే ఈ ప్రాంత రైతులు శ్రీమంతులు
తెలంగాణ ఉద్యమంలో రైతులు కీలక పాత్ర పోషించారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారు.
ఆత్మ గౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారు. ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
మా ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయమైతే… తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుంది. పసుపు బోర్డు తెస్తానన్న వ్యక్తి శంకరగిరి మాన్యాలు తిరుగుతుండు. ఈ ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు.


వరి వేస్తే ఉరే అని ప్రకటించిండు. కేసీఆర్ చెబుతున్న అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇదేనా?
తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారు.
తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. కేసీఆర్ పై కోపంతో బీజీపీ వైపు వెళ్లొద్దు…
బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే 10 లక్షల ఎకరాల చెరుకు రైతులను ఆదుకునే ఫ్యాక్టరీని ఎందుకు తెరవరు.
రైతుల కోసం 0.1 శాతం నిధులు కేటాయించలేరా? కేసీఆర్ అధికార మదాన్ని అణచివేయాలి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై పోరాడి చట్టాలను మోడీ వెనక్కు తీసుకునేలా చేసిన ఘనత రైతులది. మోదీ మెడలు వంచిన హర్యానా రైతుల స్ఫూర్తితో మీరంతా ఏకం కండి
మీరు రాజకీయ పార్టీల చుట్టూ తిరగనవసరం లేదు.. ఏకమై పోరాడితే…మీ వెంటే రాజకీయ పార్టీలు వస్తాయి. ఫ్యాక్టరీ ఎట్ల తెరుచుకోదో.. పసుపు బోర్డు ఎట్ల రాదో చూద్దాం. మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల మేలుకె కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల్లోపు చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత మాది.
రాష్ట్రంలో చత్తీస్ ఘడ్ మోడల్ పాలన అవసరం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 9వేలు ఆర్థిక సాయం అందిస్తోంది.
కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా..
వ్యవసాయ మంత్రి వస్తాడా, ఐటీ మంత్రి వస్తాడో మీ ఇష్టం, కాంగ్రెస్ పాలన… బీఆరెస్ పాలన పై చర్చ పెడదాం..మాది రైతులను ఆదుకునే విధానం.. బీఆరెస్ ది రైతు ఆత్మహత్యల విధానం