J.SURENDER KUMAR,
జిల్లా పరిధిలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్న వారి పై పెట్టి కేసు బుక్ అయితే వారికి పాస్ పోర్ట్ రాదని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు.
వారి ప్రవర్తనలో మార్పు తీసుకుని రావడానికి మరియు వారిని కట్టడి చేయడానికి మరియు భవిష్యత్తులో పెద్ద నేరాలు చేయకుండా నివారించడానికి ఈ పెట్టి కేసులు నమోదుచేయడం జరుగుతుందని ఎస్పి ప్రకటనలో పేర్కొన్నారు.
చిన్న నేరాల చేసినప్పుడే కేసు నమోదు చేసి, కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సక్రమ మార్గంలో నడపడానికి జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రతి నెల జరిగే మీటింగ్లలోఈ పెట్టి కేసులు వేసి, పెద్ద పెద్ద నేరాలు జరగకుండా నివారించవచ్చని, తగు సూచనలు సలహాలు చేస్తూ ఉండడం వల్ల పోలీస్ అధికారులు సిబ్బంది కలసి బ్లూ కోర్స్, పెట్రో కార్ తదితరులు గస్తీ నిర్వహించినప్పుడు ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి చిన్నపాటి నేరాలు చేసే అవకాశం ఉన్నందున వారందరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం , గ్రామాలలో పట్టణాలలో చిన్న చిన్న పెట్టి మ్యాటర్స్, తిట్టుకోవడం, చేతులతో కొట్టుకోవడం, పబ్లిక్ ప్రదేశాలలో న్యూసెన్స్ చేయడం మరియు ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై వారి యొక్క నడవడికలో మార్పు తేవడానికి కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. జిల్లా పరిధిలో గత ఫిబ్రవరి నెలలో 349 ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ పెట్టి కేసులు నమోదు చేయడం ద్వారా పెద్ద పెద్ద నేరాలు జరగకుండా నివారించవచ్చని బ్లూ కోర్స్ పెట్రో కార్ సిబ్బంది విధినిర్వహణలో ఉన్నప్పుడు వారికి అందజేసిన అత్యాధునిక టెక్నాలజీ టెక్నాలజీ తో కూడిన ట్యాబులల్లో ఫోటో తీసి అప్లోడ్ చేసి వెంటనే కేసు నమోదు చేయడం జరుగుతుంది తదుపరి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది. ఈ విదంగా గత ఫిబ్రవరి నెలలో 312 మందిపై నమోదైన పెట్టి కేసుల్లో వారికి కోర్ట్ ద్వార జరిమానాలు విధించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.