J. SURENDER KUMAR
న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసి సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా గత సంవత్సరం నవంబర్ 26 న న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది, అందులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి వృద్ధురాలిపై తాగిన మత్తులో మూత్ర విసర్జన ఉదంతం తెలిసిందే.
దాదాపు నెల రోజుల తర్వాత మీడియా లో రావడంతో, FIR నమోదు చేసి మిశ్రాను అరెస్టు చేశారు. దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం బెయిల్పై విడుదల అయిన విషయం తెలిసిందే.

ఈ తాజా సంఘటన శుక్రవారం రాత్రి 9:16 గంటలకు న్యూయార్క్ నుండి బయలుదేరి 14 గంటల 26 నిమిషాల తర్వాత ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో రాత్రి 10:12 గంటలకు ల్యాండ్ అయిన విమానం నంబర్ AA292 లో శనివారం జరిగింది.
“నిందితుడు యుఎస్ యూనివర్శిటీ విద్యార్థి. మద్యం మత్తులో ఉన్నాడు. మరియు అతను నిద్రిస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేసాడు. అది తోటి ప్రయాణికుడిపై పడింది, అతను సిబ్బందికి ఫిర్యాదు చేసాడు”
విద్యార్థి క్షమాపణలు చెప్పడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆసక్తి చూపలేదని, అది అతని కెరీర్ను ప్రమాదంలో పడేస్తుందని ఆయన అన్నారు. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్న ఎయిర్లైన్స్ ఐజీఐ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి ఫిర్యాదు చేశారు.
విమానంలో జరిగిన సంఘటన గురించి సిబ్బందికి తెలిసిన తర్వాత, వారు ATCకి విషయాన్ని వివరించి పైలట్కు సమాచారం అందించారు. ఇది CISF సిబ్బందిని మరింత అప్రమత్తం చేసింది, నిందితుడు ప్రయాణీకుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
“సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత CISFతో పాటు ఎయిర్లైన్స్ సొంత భద్రతా బృందం రంగంలోకి దిగింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నారు” అని ఎయిర్పోర్ట్లోని ఓ అధికారి వివరించినట్టు. PTI వార్త కథనం.
పౌర విమానయాన నిబంధనల ప్రకారం, ప్రయాణికుడు వికృత ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువైతే, క్రిమినల్ చట్టం కింద చర్యతో పాటు, నేరం యొక్క స్థాయిని బట్టి అతను నిర్దిష్ట కాల వ్యవధిలో విమానంలో ప్రయాణించకుండా నిషేధించబడతాడు.