125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ జీర్ణించుకోలేకపోతున్నారు!

కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు.!


తెలంగాణ సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు చేస్తున్నారా.?


బండి సంజయ్ కి మతి భ్రమించిందా?


పేపర్ లికేజి ఘటనలో పట్టపగలు పట్టుబడిన దొంగ బండి సంజయ్ !

J.SURENDER KUMAR,

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. దేశంలోనే అత్యంత ఎత్తులో 125 అడుగుల భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం అవిష్కరించుకున్న సందర్భంగా బండి సంజయ్ చేసిన విమర్శలు అర్ధరహితమని, బండి సంజయ్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రకటనలో మంత్రి ఆరోపించారు.

అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ జీర్ణించుకోలేకపోతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, పేపర్ లికేజి ఘటనలో పట్టపగలు పట్టు బడిన దొంగ బండి సంజయ్.. దళితుల జనోద్ధారణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే నైతిక అర్హత బండి సంజయ్ కు లేదన్నారు.
తెలంగాణ సచివాలయం భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు చేస్తున్నారా… లేక నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకు విమర్శిస్తున్నారా బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ పై తెలంగాణ సర్కార్ పై చేసిన విమర్శలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. లేనట్లయితే ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని మంత్రి కొప్పుల ప్రకటనల లోహెచ్చరించారు.