J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలో జిల్లా మెడికల్ కాలేజీ చుట్టూ నలువైపులా రహదారుల అభివృద్దిలో భాగంగా చిన్న కెనాల్ నుండి రామాలయం వరకు రోడ్ల నిర్మాణం, బస్ డిపో నుండి మాతా శిశు సంరక్షణ కేంద్రం వరకు బిటి రోడ్డు, నటరాజ్ చౌరస్తా నుండి బసవేశ్వర విగ్రహం వరకు బిటి రోడ్డు, ఐ డి ఓ సి (నూతన కలెక్టరేట్) నుండి అంతర్గాం రోడ్డు వరకు 4 లైన్ల బిటి రోడ్డు (బ్యాలెన్స్ రీచ్) అభివృద్ది పనుల కోసం ₹ 11 కోట్ల 15 లక్షల తో చేపట్టిన అభివృద్ది పనులను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
బడుగు బలహీనర్గాలకు మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ చాలా ఉపయోగం అన్నారు. జిల్లా నడి బొడ్డున 500 కోట్ల తో కళాశాల ఏర్పాటు చేశామన్నారు.
ప్రజలకు రవాణా దృష్ట్యా,వసతుల దృష్ట్యా అనువైన ప్రాంతం ఎంపిక చేయటం జరిగింది…
త్వరితగతిన పనులు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు.

మెడికల్ కళాశాలకు 150 కోట్లు మంజూరు చేయటం జరిగింది అన్నారు
11 కోట్ల తో రోడ్ల అభివృద్ది పనులు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు.
సిటీ స్కాన్, డయాగ్నొస్టిక్ కేంద్రం, రేడియాలజీ కేంద్రం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగం అన్నారు.
మెడికల్ హబ్ గా జగిత్యాల జిల్లా కేంద్రం… ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చుట్టూ పక్కల జిల్లాల నుండి సైతం ప్రజలు వస్తున్నారు .
గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే యావర్ రోడ్డు వెడల్పులో అడ్డంకులు…
1000 మీటర్ల పొడవునా ప్రభుత్వ స్థలాలు వెడల్పు చేసి,అధునాతన డ్రైనేజీ నీ ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు.
ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ లు ఓద్ధి శ్రీలత రామ్మోహన్ రావు, జుంబర్తి రాజ్ కుమార్, పట్టణ పార్టీ కార్యదర్శి బాయిన్పల్లి ప్రశాంత్ రావు, FCS డైరక్టర్ ఆరుముళ్ల పవన్, బింగి రాజేశం, వొంటిపులి రాము, రాకేష్, ఉమెందర్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.