ఆక్రమిత ప్రభుత్వ భూములను క్రమబద్ధరించుకోండి!
దరఖాస్తులు చివరి తేదీ ఏప్రిల్ 30 !

జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష!

J.Surender Kumar,

జీఓ నెం.58, 59 ద్వారా అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 30 వరకు మీ సేవా ద్వారా దరఖాస్తులను సమర్పించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీ కరణకు 2014 జూన్ 02 కటాఫ్ తేదీ ఉండగా, దానిని 2020 జూన్ 02 కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 17 న ఉత్తర్వుల సంఖ్య 29ను జారీ చేసి, నూతనంగా భూ క్రమబద్దికరణకు దరఖాస్తు లు చేసుకునేందు కు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించిందని, మీ సేవా ద్వారా ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.