బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమ ప్రభుత్వం -ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

J.Surender Kumar,

రంజాన్ మాసం ముస్లిం సోదరులు పవిత్రంగా, ఉపవాస దీక్ష తో కొనసాగిస్తారని, తెరాస ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ల సంక్షేమం కోసం
బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల రూరల్ మండల లక్ష్మి పుర్ గ్రామంలో శనివారం.బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాక ఆధ్వర్యం లో ఇఫ్తార్ విందు లో సంజయ్ కుమార్ పాల్గొని .ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జగిత్యాల నియోజకవర్గం లో మస్జీద్, షాదీఖాన, అశురఖాన ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది అని అన్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ హయాంలో మైనారిటీ ఓవర్సీస్ విద్య కోసం 20 లక్షల ఆర్థిక సహాయం ఇస్తున్నామని, మజీద్ లో పని చేసే ఇమామ్, మౌజన్ లకు పింఛన్ అందజేస్తున్నామని, ముస్లిం సోదరులకు రంజాన్ మాసం పురస్కరించుకొని రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్క పేద ముస్లిం లకు ఉచితంగా బట్టలు, విందు ఏర్పాటు చేయటం జరిగింది అని అన్నారు.
షాది ముబారక్ ద్వారా ₹100116 రూపాయలు అందజేస్తున్నమని, మైనార్టీ గురుకుల విద్యాలయ ల ఏర్పాటు ద్వారా నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తూ ఒక్కొక్క విద్యార్తి పై ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. తెలంగాణ లో కుల మత తేడా లేకుండా అందరికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్నం అని అన్నారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానం లో ఉందని, తద్వారా విదేశీ కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి అని అన్నారు. దేశ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ అని అన్నారు. నేడు ప్రతి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు. లక్ష్మి పుర్ గ్రామంలో 9 ఎండ్ల లో ₹24 కోట్ల 49 లక్షల నిధులు రావడం జరిగింది అని, గతంలో ఇంత పెద్ద మొత్తం లో ఎప్పుడైనా వచ్చేవా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గ్రామ, మండల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.