అధారాలున్న అవినీతిపరులపై ఎందుకు ? చర్యలు తీసుకోవడం లేదు !
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
J.SURENDER KUMAR,
ఒక్కో దళిత బంధు స్కీంలో రెండు నుండి మూడు లక్షలు కమిషన్లు తీసుకుంటున్నా రు అంటున్న కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారనీ, దళిత బంధు పథకం వైఫల్యానికి సీఎం కేసీఆర్ బాధ్యుడు అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
జగిత్యాలలో శుక్రవారం ఇందిరా భవన్ లో దళిత బంధు పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
పథకంలో కమిషన్లు తీసుకుంటున్నట్టు ఆధారాలు ఉన్నప్పటికీ వారిని ఉపేక్షిస్తే సీఎం కెసిఆరే వారిని ప్రోత్సహించిన వారవుతారు ఆని జీవన్ రెడ్డి అన్నారు.
సమావేశంలో ఆయన పలు అంశాలలో సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు
పేపర్ లీకేజీ కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జాప్యం కుట్ర లో భాగమేనని తీవ్ర ఆరోపణలు..
ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఐతే ఏం లాభం..కేటాయించిన నిధులు వెచ్చించకుంటే..
కెసిఆర్ కు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే బడ్జెట్ లో కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాలి అన్నారు
దళిత సమాజం తలదించుకునేలా కేవలం ఆరోపణలకే, ఎటువంటి ఆధారాలు లేకున్నా ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తాటికొండ రాజయ్యను సీఎం కెసిఆర్ తొలగించారు..
దళిత బంధు పథకంలో ఒక్కొక్కరి నుండి రు.2-3 లక్షలు వసూలు చేస్తున్నారని, ఆధారాలు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీ ఆరే చెబుతున్నా అవినీతిపరులు, కమిషన్లకు కక్కుర్తి పడిన ప్రజాప్రతినిధుల పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ? నిలదీశారు.
దళిత బంధు నా ఆత్మ బందు అంటూ, సీఎం కేసీ ఆదే దళిత బంధు పథకాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు.
నీకో నీతి. ? .దళిత సమాజానికో నీతియా ? అని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అవినీతి కి ఎవరు పాల్పడినా సహించమన్న సీఎం కెసిఆర్ అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ? ప్రశ్నించారు.
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలనే నిబంధనకు అనుగుణంగా, ఎస్సీ సబ్ ప్లాన్ రూపొందించామని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, కేటాయించిన నిధులు మరో సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసేలా నిబంధన ఏర్పాటు చేసి, నిధులు వెచ్చించకుండ దళితులను మభ్య పెడుతున్నారు అని ద్వజమెత్తారు.
దళితుల సంక్షేమం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించి, వెచ్చించని నిధులు ₹ 30 వేల కోట్లతో పాటు 2022-23 లో ప్రతి నియోజక వర్గానికి 1500 మందికి దళిత బందు ఇచ్చేందుకు బడ్జెట్ లో ₹ 17,700 కోట్లు కేటాయించినా ఒక్కరి రూపాయి ఖర్చు చేయలేదన్నారు. దళిత బంధు ఇవ్వలేదన్నారు.
2022-23 బడ్జెట్ లో నియోజక వర్గంలో 3000 చొప్పున స్వంత ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ₹.3 లక్షల చొప్పున ఇచ్చేందుకు ₹ 12,000 కోట్లు కేటాయించిన ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.
దళితులకు సంక్షేమం కోసం కేటాయించిన నిధులు సుమారు ₹ 50 వేల కోట్లతో ₹10 లక్షల చొప్పున 5 లక్షల ఇళ్లు నిర్మించవచ్చని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
దళితుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులతో ఇళ్లు నిర్మిస్తే ఇళ్లు లేని నిరుపేదలు ఉండరు అని అన్నారు.
కళ్యాణ లక్ష్మి లబ్దిదారులందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
దళితుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు సైతం వెచ్చించకోతే ప్రయోజనం ఏముందని.?ఎన్ని లక్షల బడ్జెట్ ప్రవేశ పెడితే ఎం లాభమని అన్నారు.
నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేస్తే వేతనాలు చెల్లించే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని అన్నారు.
పేపర్ లీకేజీ కూడా నియామకంలో జాప్యం కోసం చేసిన కుట్ర లో భాగమేనని ఆరోపించారు.
సీఎం కెసిఆర్ కు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే ప్రకటనలకే పరిమితం కాకుండా, దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ప్రజా ప్రతినిదులు ఏ స్థాయిలో ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంటూ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీ సీ సీ సభ్యులు గిరి నాగభూషణం, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపెల్లి దుర్గయ్య,వర్తక సంఘం అధ్యక్షుడు కమాటల శ్రీనివాస్, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, రాధా కిషన్, బొల్లి శేఖర్, మహిపాల్, బీరం రాజేష్ పాల్గొన్నారు.