ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రదేశానికి మైసమ్మ బోనాలకు వెళ్తున్న గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు!

పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం


స్తంభం పల్లిలో ఉద్రిక్తత !

J.Surender Kumar,

వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఇథ్ నాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేక సెగలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇతనాల్ వ్యతిరేక ఆందోళనలలో భాగంగా స్తంభంపల్లి గ్రామస్తులు ఆదివారం మూకుమ్మడిగా మైసమ్మ బోనాలు తీయడానికి ముందుకు వచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశానికి ర్యాలీగా బయలు దేరారు. ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మించే సర్వేనెంబర్1090, ప్రదేశాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా రోప్ వలయం ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా నిలువరించారు.

మా దేవుని దగ్గరికి, మా భూమి లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు మీరెవరు ? మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? అని మా గ్రామానికి సంబంధించిన భూమిని మీరెలా నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తారు? అంటూ. గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్యన తీవ్రమైన వాగ్వాదం జరిగింది. పోలీసులు ప్రజలు ఒకరినొకరు తోసి వేసుకున్నారు.

ప్రజలు అడుగు ముందు వేయకుండా పోలీసులు భారీ బందోబస్తుతో ధర్మపురి సీఐ బిళ్ళ కోటేశ్వర్, రోప్ వలయాన్ని ఏర్పాటు చేసి అడ్డుకున్నారు . పోలీసులు వలయాన్ని ప్రజలు ఛేదించుకొని ఇతనాల్ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశానికి చేరుకున్నారు. మా జీవితాలను నాశనం చేసే విత్తనాలు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించ వద్దని ప్రజలు పోలీసులను ప్రజలు వేడుకున్నారు.

వండివార్చిన బోనాలను మైసమ్మ తల్లికి సమర్పించి కోళ్లను కోసి రక్త తర్పణం చేశారు. మా ప్రాణాలను తీయడానికి వచ్చిన మహమ్మారి ఇతనాల్ ప్రాజెక్టు ఇక్కడి నుండి తరలిపోయేలా చూడాలని మైసమ్మ తల్లిని ppప్రజలంతా వేడుకున్నారు.


డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ను అడ్డుకున్న పోలీసులు!
స్తంభంపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మైసమ్మ బోనాలకు విచ్చేసిన జగిత్యాల డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శైలేందర్ రెడ్డిలను పోలీసులు రోడ్డుపైనే అడ్డుకొని అనుమతిని ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ప్రజల అభిప్రాయాలు ఆకాంక్షల మేరకే పోలీసులు విధులు నిర్వర్తించాలి , ప్రభుత్వం చెప్పిందానికి తలాడించే వారిగా ఉండవద్దని లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.