కన్నుల పండువగ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సహస్ర కలశాభిషేకం!

భక్తజనంతో పోటెత్తిన ఆలయ ప్రాంగణం!

J.Surender Kumar,

మంగళ వాయిద్యాలు వేద మంత్రాల ఘోషలో అంగరంగ వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి సహస్ర కలశాభిషేకం ఆదివారం ఉదయం కన్నుల పండువగా జరిగింది.

ఈ సుందర మనోహర దృశ్యాన్ని తిరగించడానికి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది.

 స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు ఉదయం, వేదపండితులు, అర్చకులు, పురుషసూక్త , శ్రీసూక్తం   కల్పోక్త న్యాసపూర్వక ,  షౌడశోపచార పూజ , సహస్రనామార్చన,  పంచోపనిషత్తులతో, రుద్రాభిషేకం , మరియు వాస్తు , యోగిని,  క్షేత్ర పాలక , నవగ్రహ, సర్వతోభద్రమండలి ,  స్థాపిత దేవతాపూజల  అనంతరం  పూర్ణాహుతి , శ్రీ యోగ, శ్రీ ఉగ్ర స్వామి వారికి  సహస్ర కలషాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

 కన్నుల పండువ గ జరిగిన సహస్ర కలశాభిషేకం మహోత్సవం తిలకించడానికి, భక్తజనం గంటల తరబడి బారులు తీరి వేచి ఉన్నారు.

సహస్ర కళాశాలకు పూజలు!
వేదమంత్రోత్సవాలు మధ్యన సహస్ర కరశాలను తెస్తున్న దృశ్యం!
బారువతీరిన భక్తజనం!
యోగా నరసింహ ఆలయంలోకి కళాశాలతో!
కలశాభిషేకం తిలకిస్తున్న భక్తులు!
అభిషేక జలాలు భక్తులపై కి!
హారతి!
శ్రీ ఉగ్ర నారసింహస్వామి!