మంత్రి కొప్పుల ఈశ్వర్!
J. Surendar Kumar,
అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలులతో జగిత్యాల రూరల్ మండల లక్ష్మీపూర్ గ్రామంలో దెబ్బతిన్న మామిడి, నువ్వు పంటలను ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధిత రైతులను, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి అన్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపరిహారాన్ని అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నీ ఫోన్ లో కోరారు.

జిల్లా వ్యవసాయ శాఖ ఆదికారులకు రైతులకు ఇబ్బంది లేకుండా నష్ట పరిహార నివేదిక ప్రభుత్వానికి పంపి, వారిని ఆదుకోనే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ చెరుకు జాన్, ఆత్మ చైర్మెన్ రాజిరెడ్డి, గ్రామశాఖ అద్యక్షుడు సత్తిరెడ్డీ, లక్ష్మణ్ మరియు స్థానికనేతలు, రైతులు, ఉన్నారు.