ఏపీ జెన్ కో విద్యుత్తు బకాయిలు – ₹ 6,756.92 కోట్ల బకాయిలు విడుదల చేయండి!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం  వైయస్‌.జగన్‌ భేటీ లో..

J.SURENDER KUMAR,

శనివారం ఢిల్లీలో జరగనున్ననీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను మర్యాదపూర్వకంగా కలిసి నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు విద్యుత్ బకాయిల అంశంపై లేఖను అందించారు.
రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరాచేసిన విద్యుత్‌, ₹.6,756.92కోట్ల బకాయిల అంశాన్నీ ప్రస్తావించిన ముఖ్యమంత్రి. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకొచ్చిన అంశాన్నీ గుర్తుచేసిన సీఎం.
ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని విజ్ఞప్తిచేసిన సీఎం.

2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు అంశాన్ని ఆర్థికమంత్రితో చర్చించిన సీఎం.
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు – నేడు కింద ఇప్పటికే రూ.6వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని, ఆరోతరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపిన సీఎం.   అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రులవరకూ నాడు -నేడు కింద పనులు చేపట్టామని,చ ఇప్పటికే దీనికోసం వేల కోట్లు ఖర్చుచేశామని పేర్కొ్న్న సీఎం.  అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రులవరకూ నాడు నేడు కింద పనులు చేపట్టామని,చ ఇప్పటికే దీనికోసం రూ.4వేల కోట్లు ఖర్చుచేశామని పేర్కొ్న్న సీఎం.
రాష్ట్ర ప్రభవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని, వీటికోసం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి.  శనివారం నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గోనున్న ముఖ్యమంత్రి.