బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఎస్పీ ఆదేశం !

పోలీస్ గ్రీవెన్స్ లో ఫిర్యాదులు!

J. SURENDER KUMAR,

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 32 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ భాస్కర్ ఆదేశించారు. పిర్యాదులు భూ సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్, గల్ఫ్ కు పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన సమస్యల పైన పిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా కోడిమ్యాల మండలానికి చెందిన ఒక వ్యక్తి 9 మందిని మలేషియా కు పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన విషయంలో విచారణ జరిపి కేసు నమోదు చేయాల్సిందిగా మల్యాల సి.ఐ రమణమూర్తి ని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.