ప్రాజెక్టు పూర్తయితే అడ్లూరి రాజకీయం సమాప్తం_
ఫ్యాక్స్ చైర్మన్ ల ఫోరమ్ అద్యక్షులు రాజసుమన్ రావు !
J.SURENDER KUMAR,
తెలిసి తెలియకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నవొస్తుందన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన చిల్లర రాజకీయాలు తెరలేపాడని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి కూడా రాజకీయ లబ్ధికోసం అసత్య ప్రచారాలకు శ్రీకారం చుట్టారు అని ఫ్యాక్స్ చైర్మన్ ల ఫోరమ్ అద్యక్షులు రాజసుమన్ రావు ఆరోపించారు.
జగిత్యాల ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు
ఇతనాల్ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు బయటకు రాకుండా బాబిలింగ్ చేస్తారని, ఇది కెమికల్ ఫ్యాక్టరీ కాదని రాజ సుమన్ రావు అన్నారు. ప్రాజెక్టు వల్ల ప్రజలకు లాభాలను చెప్పడానికి మేము, నష్టాలను చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు అడ్లూరి, జీవన్ రెడ్డిలు చర్చకు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. చర్చకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమేనని తోకముడిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణంతో నీరు, వాయు కలుషితమైతదని రోగాలు వస్తాయని ప్రజలకు లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రాజెక్టులు రావాలని కోరుకోవాల్సిన ప్రతిపక్ష నేతలు వచ్చిన ప్రాజెక్టును వేరే చోటకు తరలించాలని జీవన్ రెడ్డి మాట్లాడడం తగదన్నారు. నిజాలను ప్రజలకు చెప్పాలే అసత్యాలు ప్రజలకు చెప్పి ప్రజలకు నష్టం కలిగించొద్దన్నారు. పాశిగం పూర్తిగా ఎస్సి గ్రామమని ఇక్కడ పరిశ్రమ పెడితే ఎంతొ లాభమని భావించిన మంత్రి ఈశ్వర్ పూర్తి ప్రభుత్వ భూమిలో గుట్టలలో ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థలం ఎంపిక చేశారన్నారు. ఈ స్థల పరిశీలన కోసం వచ్చిన సంస్థ బోర్డ్ సభ్యుల్లో పొన్నం ప్రభాకర్ ఒకరని రాజా సుమన్ రావు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయం సమాప్తం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి ఈశ్వర్ కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకుల కుట్రలన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎప్పటికప్పుడు జరిగేలా చేస్తుంటే దానిమీద విమర్శలు చేయడం సరికాదన్నారు.
ప్రతిపక్షాల నేతల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని రాజ సుమన్ రావు హెచ్చరించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దొంగలెక్కలు ప్రజలకు తెలిసిపోయాయని ప్రజలను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెప్తామని రాజ సుమన్ రావు హెచ్చరించారు.
డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ఇతనాల్ ప్రాజెక్టు తో ఎలాంటి నష్టం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగోడుతున్నారని, ఇతనాల్ ప్రాజెక్టుతో నష్టముంటే ఆధారాలతో రావాలని ఎక్కడైనా చర్చకు సిద్ధమని డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు.,
ఇతనాల్ ప్రాజెక్టు ఏర్పాటుతో రైతులకు మేలు తప్ప ఎటువంటి నష్టం లేదని కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు లేనిపోనివి చెప్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఫ్యాక్స్ ఛైర్మన్ లు మహిపాల్ రెడ్డి, సౌళ్ల నరేష్, గందే వెంకట మాధవరావు, మంత్రి వేణు, ఏనుగు మల్లారెడ్డి తోపాటు బోయినపల్లి మధు సుధన్ రావు పాల్గొన్నారు.