గ్రామాలకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పునరుద్ధరించాలి !

రోడ్డు ప్రమాదాల నివరణపై  అధికారులు దృష్టి సారించాలి !


జగిత్యాల ఎస్పీ భాస్కర్!


J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ ( VPO ) వ్యవస్థను పునరుద్ధరించాలి ఎస్పీ భాస్కర్ అన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి  ప్రజలకు సమర్థవంతమైన సేవలు  అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ  సూచించారు గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి జరిగిన క్రైమ్ మీటింగ్ లో అన్నారు.

ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు. VPO లు  ప్రతి  గ్రామని  సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి  మార్గంలో నడిచేటట్లు  వారికి అవగాహన కల్పిచాలన్నారు.


ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ… జిల్లా లో నమోదు అయిన కేసులు, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులు వాటిపై చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు అడిగారు. పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్ కేసుల దర్యాప్తు లు, పురోగతి లు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్ కు విధిగా స్పందించడంతో పాటు సాధ్యమైనంత త్వరితంగా ఘటనా స్థలానికి చేరుకోవడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని మరింత పెంచేలా పని చేయాలని సూచించారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల రెస్పాన్స్ సమయం, క్లోజింగ్ సమయం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతిరోజు ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ పెట్టి కేసులు నమోదు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. నేరల నియంత్రణతో పాటు దర్యాప్తు చేధనకు దోహదపడే సిసి కెమెరాలు నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు, వివిధ యూనియన్ నాయకులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించి  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై  ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు.
ఈ   సమావేశంలో   డీఎస్పీ లు  ప్రకాష్, రవీంద్ర రెడ్డి,  SB, DCRB, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ లు  రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్,  సి.ఐ లు, రాంచందర్ రావు, లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీ ఖాన్ , కోటేశ్వర్,  ప్రవీణ్ కుమార్, ఎస్.ఐ లు DCRB, ఐటీ కోర్ సిబ్బంది  పాల్గొన్నారు.