జిల్లాలో  పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా !
ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్.!

మాజీ మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి.!

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రంలో కారు స్ట్రిరింగ్  ఏమ్ఐఎమ్ చేతిలో ఉందని, ప్రభుత్వంపై వొత్తిడితెస్తూ ప్రజల రక్షకులైన పోలీసులకే చట్టం పనికిరాని చుట్టమైందని, ఓ వర్గానికి చెందిన వందలాది మంది వచ్చి ఆందోళనకు దిగితే నిఘా సంస్థలు నిద్రపోయాయా  ? అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు

జగిత్యాల ప్రెస్ క్లబ్లో డా.శ్రావణి , బిజెపి నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం రోజున  జగిత్యాల పట్టణ  ప్రజాలు భయబ్రాంతులకు గురయ్యేలా ఒక వర్గం పట్టణ నడిబొడ్డును ఆందోళన చేపట్టిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తోపాటు 12 మంది హైకోర్టు న్యాయమూర్తులు బీరప్ప దర్శనానికి వచ్చారన్నారు. వీరందరికి అసౌకర్యం కలిగించేలా ప్రధానంగా  అంబులెన్స్ ను కూడా డైవర్ట్ చేసేలా ఆ వర్గం ఆందోళన చేసిందన్నారు. వాస్తవానికి గత రెండు రోజుల క్రితం బస్సులో జరిగిన సంఘటనలో ఒక మహిళ తనను టిజింగ్ చేస్తున్నారని, చంటి పిల్లతో ఉన్న ఆ మహిళ  తన భర్తను కోరితే వచ్చిన వ్యక్తి పోలీసు కావడంతో ఈసంఘటనకు మతం రంగు పులిమి ఆందోళనకు దిగరన్నారు. వందలాది మంది వచ్చి పోలీసు స్టేషన్ ముందే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారని శ్రావణి పేర్కొన్నారు. ఇద్దరు మహిళల మధ్యన జరిగిన ఈ అంశంపై విచారణ చేయకుండా, వాస్తవాలను వెలికితీయకుండా ఎం.ఐ.ఎం ఒత్తిడితో ఆ పోలీసు అధికారిపై చర్యలను చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందని శ్రావణి ఆరోపించారు. ఎవరికైనా కష్టం వస్తే పోలీసు స్టేషన్ మెట్లెక్కుతారని, అదే పోలీసు స్టేషన్ లోని ఓ పోలీసుకె భద్రత లేకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల ఉన్నాయా ?  అని బోగ శ్రావణి ప్రశ్నించారు. ఇక ఈ సంఘటనకు మతం రంగు పులిమి పోలీసు అధికారిపై చర్యకు ఆందోళనకు దిగేందుకు నిజామాబాద్, బోధన్, ఆర్ముర్, కోరుట్ల వంటి ప్రాంతాల నుంచి వందలాదిగా ఒక వర్గం ప్రజలు జగిత్యాలకు వచ్చారని వీరి రాకపై నిఘా సంస్థలు ఎందుకు అరా తీయలేదని ?  ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో, జగిత్యాలలో నిఘా సంస్థలు కేవలం బిజెపి కార్యక్రమాలపై నిఘా పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శాంతియుతంగా హనుమాన్ చాలీసా పటిస్తా మని అంటే పోలీసులు, బిజెపి నాయకులను చేట్టుకో పుట్టకో పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తారని శ్రావణి అన్నారు. ఇటివలే జిల్లా ఎస్పీ  జగిత్యాల జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని ప్రకటించారు.  సభలు, సమావేశాలు, జనం గుమికూడడం నిషేధముందున్నారు. బుధవారం రోజున ఓ వర్గానికి చెందిన వందలాది మంది వచ్చి ఆందోళన చేస్తే పోలీసు యాక్ట్ ఎక్కడ ?  పోయిందని శ్రావణి ప్రశ్నించారు.  ఎంతమందిపై కేసులు పెట్టారో  పోలీసులు ప్రకటించాలని శ్రావణి డిమాండ్ చేశారు. గోరక్షక దళాలపై కేసులు పెట్టె పోలీసులు ఎందుకు బుధవారం గుమిగూడిన  ఆ వర్గం ప్రజలపై కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. బిజెపి పార్టీ అందరి సంక్షేమాన్ని కోరుతుందని, ఎవరికి అన్యాయం జరిగినా ముందుంటామని  అన్నారు. అందులోనూ మహిళలకు అన్యాయం జరిగితే మొదటే ఉంటామని అన్నారు. ఇద్దరు మహిళల మధ్యన జరిగిన సంఘటనలో విచారణ జరపకుండా చర్యలు చేపట్టడాన్ని తప్పుపట్టారు.  పోలీసులు విచారణ చేసి న్యాయం అందించాలని శ్రావణి కోరారు. రానున్నది బిజెపి ప్రభుత్వమని ఇప్పటిలా ఒక వర్గానికి కొమ్ముకాసేలా కాకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసేలా శాంతి భద్రతలను పరిరక్షించేలా బిజెపి పాలన ఉంటుందని శ్రావణి అన్నారు. ఒకవర్గానికి కొమ్ము కాసే చర్యలను అనుకోవాలని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పాలకులకు బుద్ది చెప్పడం ఖాయమని బోగ శ్రావణి అన్నారు. అనంతరం చిలకమర్తి మదన్ మోహన్, వీరబత్తిని అనీల్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో.. BJYM జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరిపెళ్లి సత్యం, సారంగాపూర్ మండల ప్రెసిడెంట్ ఎండబెడ్ల వరుణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, BJYM జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు ఉమేష్, BJYM జిల్లా కోశాధికారి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.