ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్, 2 నుంచి 22, వరకు మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు జిల్లా లో ఘనంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల కు సంబంధించి జగిత్యాల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో పోలీస్ శాఖ పరంగా చేయవలసిన ఏర్పాటలపై ఎస్పీ భాస్కర్ శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22వ వరకు మూడు వారాల పాటు సాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల, జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ మూడు వారల పాటు భద్రత పరమైన ఏర్పాట్లను చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పోలీస్ శాఖ నిర్వహించే సురక్ష దినోత్సవం, మరియు తెలంగాణ రన్, కార్యక్రమాలను విజయవంతం కు కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు.
జూన్ 4వ తేదీ ఆదివారం - సురక్షా దినోత్సవం!

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని ఆదేవిదంగా పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలి. పోలీస్ జాగృతి కళాకారుల బృందాలతో ప్రదర్శనలు. పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, పోలీస్ జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన, పెట్రోలింగ్ కార్స్, Blue colts, వెహికిల్స్ తోర్యాలీ నిర్వహించాలి.
జూన్ 12వ తేదీ సోమవారం- తెలంగాణ రన్!
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా లోని అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో పోలీసు శాఖ నేతృత్వంలో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి క్రీడలు, యువజన సర్వీసులశాఖ వారితో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ప్రకాష్, రవీంద్రారెడ్డి రవీంద్ర కుమార్, SB, DCRB, ITCORE, CCS ఇన్స్పెక్టర్లు రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్, నాగేశ్వరరావు మరియు సి. ఐ లు కోటేశ్వర్, ప్రవీణ్ లక్ష్మీనారాయణ, రమణమూర్తి RI లు వామనమూర్తి, నవీన్ పాల్గొన్నారు